పాత రాజరాజేశ్వరి పేటలో శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు నిరసన ధర్నా
బాధితులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్
56వ డివిజన్ రాజరాజేశ్వరిపేట లోని మహంకాళిమ్మ రోడ్లో ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్
దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారు
గతంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టింది
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ రైల్వే స్థలం చూపించడం జరిగింది
ఈ రైల్వే స్థలం కు అనుగుణమైన స్థలం ఏర్పాటు చేశాం
అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు
ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రజలు రోడ్డు మీదకు తెచ్చారు
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలి
15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే చర్యలు ఉంటాయని భయపెట్టడం సరికాదు
రైల్వే అధికారులు దండోరా వేయటం ఎంత వరకు సమంజసం
దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ప్రజలు నివాసం ఉంటున్నారు
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సహకరించాలి
ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నాలో పాల్గొంటుంది
ప్రజలకు న్యాయం జరిగే వరకూ వారికి తోడుగా ఉంటాము
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతి రావు , 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు , బత్తుల పాండు , వాసా బాబు , గొలగాని శ్రీనివాసరావు , అండలూరి లతా తదితరులు పాల్గొన్నారు