Home Andhra Pradesh పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు భేష్• మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత• రేపు, ఎల్లుండి...

పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు భేష్• మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత• రేపు, ఎల్లుండి గుంటూరు, తిరుపతిలో మహిళలకు అందుబాటులో ఉంటా

2
0

విజయవాడ: 17-05-2025

• పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు భేష్
• మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత
• రేపు, ఎల్లుండి గుంటూరు, తిరుపతిలో మహిళలకు అందుబాటులో ఉంటా

– డాక్టర్ అర్చన మంజుందార్, జాతీయ మహిళా కమిషన్ సభ్యులు

పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, మోర్టాలిటీ రేటు కూడా తక్కువగా ఉందని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి. డాక్టర్ అర్చన మజుందార్ తెలిపారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన లో భాగంగా మొదటి రోజు మంగళవారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని, వన్ స్టాప్ సెంటర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డాక్టర్ అర్చన మజుందార్ ఆధ్యంతం అన్ని మహిళా వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు డాక్టర్ అర్చన మజుందార్ మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో మూడు రోజుల పాటు పర్యటించి మహిళలకు పనిప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పరిశీలిస్తామన్నారు. ఈ రోజు పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు పరిశీలిస్తే చాలా బాగున్నాయని, ఇంకా చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సరిచేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావు కు సూచించానన్నారు.  

     ఆసుపత్రి పరిసరాలు హైజీనిక్ గానే ఉన్నాయన్నారు. మహిళలకు వార్డుల్లో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని, రోజువారీ బెడ్ షీట్స్ కూడా మారుస్తున్నారన్నారు. అదేవిధంగా మహిళల భద్రత, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. డాక్టర్స్ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ, మంచి టీమ్ వర్క్ తో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి  లైగింక వేధింపులపై సిబ్బందిలో అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాలని సూపరిండెంట్ కు తెలియజేయగా ఇప్పటికే కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఆ కమిటీ మూడు నెలలకు ఒకసారి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు.. మహిళలను లైంగికంగా వేధింపులకు ఏమైనా గురిచేస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారు ఉపయోగించే టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అని అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు స్వయంగా పరిశీలించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పేషెంట్స్ కు, సిబ్బందికి సూచించారు. డాక్టర్స్ డ్యూటీ రూములు, పీజీ డాక్టర్ల సేఫ్టీ, డ్యూటీ సమయాల్లో సౌకర్యాలు వారిని అడిగి తెలుసుకున్నారు. మాకు సౌకర్యాలు బాగానే ఉన్నాయని పీజీ డాక్టర్లు తెలిపారు. బాలికలు, మహిళల రక్షణ కోసం, వారి సాధికారత కోసం మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉపయోగపడే వన్ స్టాప్ సెంటర్ ను సభ్యులు పరిశీలించి బాధితులతో భేటీ అయ్యారు. అక్కడకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన వసతి, సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డొమెస్టిక్ వైలెన్స్, పోక్స్ కేసులు, అట్రాసిటీ కేసులపై జాతీయ మహిళా కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు.

      రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో పర్యటించి మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందో జాతీయ మహిళా కమిషన్ అంచనా వేస్తుందన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశంలో ఎలా ఉన్నారో, అక్కడ వాతావరణం ఎలా ఉందో, వేధింపులకు ఏమైనా గురౌతున్నారో చూస్తారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భవతులకు, బాలింతలకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు, మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, డాక్టర్స్ బాగా చూస్తున్నారా లేదా అని ఈ రోజు పరిశీలించారన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని తెలిపారన్నారు.  మహిళల రక్షణ కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ పనిచేస్తామన్నారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్నారు. 

కార్యక్రమంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ఏ.వెంకటేశ్వరరావు, ఆర్ఎమ్ వో లు డాక్టర్ శోభ, శ్రీనివాస రాజు, ఆసుపత్రి సిబ్బంది, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా, తదితరలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here