పశ్చిమ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి .
ప్రజలకు ఇచ్చిన హామీ లు నెరవేర్చాలి..
అధికారుల సమీక్షలో సుజనా చౌదరి..
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి వీ ఎమ్ సీ, ఇతర అన్ని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి ) కోరారు.
తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో వీ ఎమ్ సీ, అనుబంధ శాఖల అధికారులు, కార్పొరేటర్లతో నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.
పశ్చిమలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి మరింత అభివృద్ధి జరగాలన్నది తన లక్ష్యమన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పశ్చిమాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని , అందుకోసం అధికారులు ప్రో యాక్టివ్ గా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో అధికారులు ముందు గానే గుర్తించి పైపులైన్ల మరమ్మతులు, నూతన పైపులైన్ల నిర్మాణం, బోర్లు ఏర్పాటు చేయాలన్నారు, తాగునీటిలో కలుషిత నీరు కలవకుండా పక్కాగా చర్యలు చేపట్టాలన్నారు. వార్డు సచివాలయాల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించాలన్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే ఆయా డివిజన్లో అవసరమైన ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయాలనీ సూచించారు . పశ్చిమ నియోజకవర్గంలోని పార్కులను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు, పార్కులకు అనువుగా, అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి ప్రతిపాదనల సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా చేపట్టవలసిన రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రాం వాటర్ డ్రైన్ల నిర్మాణం పెండింగ్ లో ఉన్న పనుల వివరాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ లోని ట్రాఫిక్ సమస్యకు మూలమైన ఆక్రమణలు తొలగించే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు..
హైరైజేస్ నిర్మాణానికి ప్రణాళికలు..
పాతబస్తీ లో కొండలపై నివాసం ఉంటున్న వారి కి పునరావాసం పై దృష్టి సారించాలని, అందులో భాగంగా కొండ దిగువన స్థలాలు పరిశీలించి అక్కడ హై రైజేస్ నిర్మాణం పై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు..
ఎలివెటెడ్ కారిడార్..
పంజా సెంటర్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు వెండర్ల కోసం ఎలివెటెడ్ కారిడార్ నిర్మాణం పై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు..
పశ్చిమ సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని సుజనా చౌదరి కోరారు.
ఈ సమావేశంలో తీసుకున్న అంశాలపై సత్వర పరిష్కారానికి కృషి చేసి వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందజేయాలని ఆయా శాఖల అధికారులను సుజనా చౌదరి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు .
ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, సిటీ ప్లానర్ ప్రసాద్, డీసీపీ చంద్రబోస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మురళి గౌడ్, రిజ్వానా
టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎమ్ ఎస్ బెగ్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ , గుడివాడ నరేంద్ర రాఘవ, మైలవరపు దుర్గారావు, మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, హర్షద్, ఉమ్మడి వెంకటేశ్వరరావు, మైలవరపు మాధురి లావణ్య తదితరులు పాల్గొన్నారు.