తేదీ: 06-02-2025
అమరావతి/మంగళగిరి
పర్యాటకంతో అభివృద్ధి పథం
*రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్*
*రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి దుర్గేష్*
*రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్ లైన్ సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి దుర్గేష్*
*త్వరలో సీఎం తో జరిగే మీటింగ్ లో టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండరు అనుమతి తీసుకొని ముందుకు వెళదామన్న మంత్రి దుర్గేష్*
*ఫైళ్ల క్లియరెన్స్ లో అగ్ర స్థానం రావడం శాఖ పనితీరుకు నిదర్శనమని అధికారులను అభినందించిన మంత్రి దుర్గేష్*
అమరావతి : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేసి తమదైన ముద్రవేయాలని పర్యాటక శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ దిశా నిర్దేశం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ 11వ ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ శాఖల అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి దుర్గేష్ అధికారులకు మార్గదర్శకత్వం అందించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్ లైన్ సిద్ధం చేసి తీసుకురావాలని, ఈనెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో జరిగే సమావేశంలో అనుమతి తీసుకొని విస్తృత ప్రచారం కల్పించేందుకు పాటుపడాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధిపై మంత్రి దుర్గేష్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని రమ్మని అధికారులకు మంత్రి దుర్గేష్ సూచించారు. స్థానికంగా ఏ తరహా పర్యాటక అభివృద్ధి చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా అటవీ, దేవాదాయ శాఖల అనుమతులు అవసరం వస్తే తాను సంబంధిత కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్ గా ఉన్నానని, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల మంత్రులు పవన్ కళ్యాణ్, ఆనం రాం నారాయణ రెడ్డి లతో చర్చించి పరిష్కారానికి పాటుపడతానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అధికారులకు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో అమితమైన విశ్వాసము ఉందని, ఆసక్తితో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సరైన వివరాల అందించి పీపీపీ విధానంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు మంత్రి దుర్గేష్ సూచించారు. సీఎస్సార్ నిధులు రాబట్టడం పై దృష్టి పెట్టి తద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండరు సిద్ధం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఈవెంట్లు చేద్దామన్నారు.
తిరుపతి లాంటి అధ్యాత్మిక ప్రాంతాల్లో హోం స్టే లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. తిరుపతి తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో శాఖాపరంగా తలెత్తిన సిబ్బంది సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సూర్యలంక మైపాడు బీచ్ లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విభిన్న తరహా టూరిజం లను అభివృద్ధి చేయాలని సంకల్పించామని టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి అన్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, అడ్వెంచరస్ స్పోర్ట్స్, చిల్డ్రన్స్ గేమ్స్, ఫిషింగ్ విత్ ఫిషర్ మెన్ వంటివి పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశపెడతామని అన్నారు. పర్యాటకుడు పర్యాటక ప్రాంతంలో ఎక్కువ రోజులు గడిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
*ఈ సందర్భంగా పర్యాటకశాఖ సెక్రటరీగా ఇటీవల నియమితులైన అజయ్ జైన్, ఎండిగా ఆమ్రపాలి కాట పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. పర్యాటకశాఖ పరంగా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, శ్రద్ద వహించి పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యాటకాభివృద్ధికి కృషి చేయడమే గాక, అధికారులకు దిశా నిర్దేశం చేస్తుండటం పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.*
*ఫైళ్ల క్లియరెన్స్ అంశంలో పర్యాటక శాఖ, పేషి పనితీరును కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ శాఖ అధికారులకు వివరిస్తూ అభినందించారు.. పర్యాటకశాఖ అధికారులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.*
పర్యాటకం పరంగా ఏమేం అభివృద్ధి చేయాలో మరింత సృజనాత్మకంగా ఆలోచించాలన్నారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల కన్నా అంతకుమించి అందాలు, సహజ సిద్ధ ప్రదేశాలు, ప్రకృతి రమణీయత ప్రదేశాలు ఎక్కువున్నప్పటికీ ప్రాచుర్యంలో వెనుకబడ్డామని ఈ సందర్భంగా ఆడియో, వీడియో ల రూపంలో ప్రమోషన్స్ పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి, కోనసీమ, వైజాగ్ లాంటి ప్రాంతాలే కాకుండా 26 జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి సరైన ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సూచించారు..
పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించారని గుర్తుచేస్తూ నూతన పర్యాటక పాలసీపై పెట్టుబడి దారులకు అవగాహన కల్పించి పెట్టుబడులు రాబట్టాలన్నారు. ఇన్వెస్టర్స్ టీం కి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమాలు చేద్దామన్నారు. ఇటీవలే విజయవాడ విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఇన్వెస్టర్ సమ్మిట్లు నిర్వహించామని త్వరలో తిరుపతిలో ఇన్వెస్టర్ సమిట్ నిర్వహిద్దామని తెలిపారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో సైతం ఇన్వెస్టర్స్ సమ్మిట్లు నిర్వహించి ఇన్వెస్టర్లను ఆకర్షిద్దామని తద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసి భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిద్దామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు..
కార్యక్రమంలో టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, ఎండి ఆమ్రపాలి, ఈడిలు పద్మావతి, శేషగిరి, ఏపీ టీడీసీ, ఏపీ టీఎ అధికారులు, ఆర్ డీలు, డీవీఎం లు, డీటీసీ లు, 26 జిల్లాల టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.