న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
వన్ టౌన్ లోని న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జి సాయి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్గనైజేషన్ లోని సేవా కార్యక్రమాలు తదితర వివరాల అడిగి తెలుసుకున్నారు.
సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ హోంగార్డుగా విధులు నిర్వహిస్తూనే తన తండ్రి జ్ఞాపకార్థంగా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు .న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ద్వారా దాతల సహకారంతో పేద విద్యార్థిని విద్యార్థులకు, అనాధ పిల్లలకు, హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు వృద్ధులకు తమ సేవలను అందిస్తున్నామన్నారు. సమాజ సేవలో భాగస్వాములైన సాయి వినయ్ కుమార్ ను
ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో నేతలు అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి, వేంపలి గౌరీ శంకర్, చింతా సృజన్, మంతెన తరుణ్, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.