నేషనల్ మైనార్టీ కమిషన్ మెంబర్ సయ్యద్ షహజాది విజయవాడలోని భవానిపురం లో గల SMAK ఉర్దూ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షేరీన్ బేగం, ఐపీఎస్, సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.