నేషనల్ మైనారిటీ కమిషన్ మెంబర్ మిస్ సయ్యద్ షహజాది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈఈ కార్యక్రమంలో వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు మరియు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు లను రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న సహాయ కార్యక్రమాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందుతున్న పథకాల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ ను , PMJVK తరగతి భవనాలను మరియు హాస్టల్ భవనాలను త్వరగా అందుబాటులోకి తెచ్చి అందులో తరగతులను నిర్వహించవలసిందిగా రాష్ట్ర అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కె హర్షవర్ధన్ ఐఏఎస్ , కమిషనర్ చిట్టూరి శ్రీధర్ ఐఏఎస్ , షేక్ షేరీన్ బేగం ఐపీఎస్, సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ మరియు వివిధ రాష్ట్రస్థాయి శాఖల అధికారులు పాల్గొన్నారు.