నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు మేలు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ/విజయవాడ:- నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుల మంజూరుపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం మీడియాకు వివరించారు. అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన పాండురంగాపురం – భద్రాచలం – మల్కన్గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా నూతన రైలు మార్గాన్నిఅందిస్తూ ఇది అసన్సోల్ మరియు వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జునాగర్హ – నబరంగ్పూర్-జీపూర్-మల్కన్గిరి-భద్రాచలం-పాండురంగాపురం మధ్య అనుసంధానంను అందజేస్తుంది. ఈ కొత్త రైలు మార్గం జునాగఢ్-నబరంగ్పూర్, మల్కన్గిరి-భద్రాచలం-పాండురంగాపురం మధ్య 290 రూట్ కిలోమీటర్ల మేర రూ.7383 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఈ విషయమై మంత్రి న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మరియు హైదరాబాద్ మీడియాతో వర్చువల్గా సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయన్నారు. ఉత్తర మరియు తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్ అవుతుందని దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి, అల్యూమినియం మరియు ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంలో ప్రయోజనకారిగా సహాయపడుతుందన్నారు. ఈ కొత్త లైన్ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కూడా అందిస్తుందని, ఇప్పటికే ఉన్న విజయవాడ-విశాఖపట్నం-భువనేశ్వర్- కోల్కతా కోస్తాతీర ప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్-భద్రాచలం-మల్కన్గిరి- జయ్పూర్ – టిట్లాగఢ్కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుందని తెలిపారు.*