Home Political news నూతన పార్లమెంట్ లో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం పూజ కార్య‌క్ర‌మంలో...

నూతన పార్లమెంట్ లో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ చిన్ని

4
0

 26-11-2024

నూతన పార్లమెంట్ లో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ చిన్ని

ఢిల్లీ : నూతన పార్లమెంట్ మొదటి అంతస్తులో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీకి కేటాయించిన నూత‌న కార్యాలయం ప్రారంభోత్స‌వం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన పూజ‌కార్య‌క్ర‌మాల్లో టిడిపి ఎంపిల‌తో పాటు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి నూతన పార్లమెంట్ భవనంలో మొదటి అంతస్తులో కేటాయించిన నూతన కార్యాలయం ఎఫ్09 నుంచి కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషంగా ఉంద‌న్నారు.నూతన పార్లమెంటులో ప్రధాని, కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఉన్న మొదటి అంతస్తులో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ కార్యాలయం ఉండటం గర్వంగా ఉందన్నారు.

జూన్ నెల‌లో జ‌రిగిన‌ పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో త‌మ‌కి కేటాయించిన కార్యాల‌యం గ‌ది చిన్నదిగా వుండటంతో , కావున కొంచెం విశాలమైన స్థలం వున్న కార్యాలయం కేటాయింపు చేయాల్సిందిగా టిడిపి పార్లమెంట్ పక్ష నేత లావు కృష్ణదేవరాయ ఆధ్వర్యంలో టిడిపి ఎంపీలందరూ కలిసి వెళ్లి స్పీకర్ ఓం బిర్లా కోరటం జ‌రిగింది. త‌మ విజ్ఞప్తి పై స్పందించి విశాల‌మైన కార్యాల‌యం కేటాయించినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ స్పీక‌ర్ ఓం బిర్లాకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి పార్లమెంట్ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు, కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపి మెతుకుమిల్లి భ‌ర‌త్, ఎంపి క‌లిమిశెట్టి అప్ప‌ల‌నాయుడు,ఎంపి హ‌రీష్ మాథుర్ బాల‌యోగి, ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు,ఎంపి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి , ఎంపి తెన్నేటి కృష్ణ ప్ర‌సాద్, తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ సెక్ర‌ట‌రీ స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here