Home Political news నున్న ఫిబ్రవరి 21 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు భారీ...

నున్న ఫిబ్రవరి 21 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ,

2
0

 నున్న ఫిబ్రవరి 21 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ,

గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా 

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 27 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు.  గన్నవరం చరిత్ర లోనే ఎప్పటి రాని మెజార్టీతో శాసన సభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకటం అదృష్టమని అన్నారు.. గత వైసిపి పాలన లో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు కేవలం  ఒక ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో  రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అవినీతి కి పాల్పడిన ఏ వైసిపి నాయకుడిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బియ్యం దొంగ పేర్ని నాని పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దశల వారిగా సూపర్ సిక్స్ ను అమలు చేస్తున్నామని మెగా డీఎస్సీ నిర్వహిస్తామని . జూన్ నాటికి తల్లికి వందనం కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర ప్రజల కు మంచి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. 

అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆలపాటికి ఉందని ఆయన ఎమ్మెల్సీ ఐతే పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కూటమి నేతలు కలసి కట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో అఖండ మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డళ్ల చిన రామారావు , గన్నవరం నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు కోట వీరబాబు, జన సేన నియోజకవర్గ అధ్యక్షులు చలమలశెట్టి రమేష్, టీడీపీ నియోజక వర్గ పరిశీలకులు హరిబాబు,  ఆళ్ల గోపాలకృష్ణ, గుజ్జర్లపూడి బాబు రావు మూల్పూరి సాయి కళ్యాణి , గూడవల్లి నరసింహారావు కూటమి నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here