ఎన్టీఆర్ జిల్లా
໖໖: 19.10.2024
నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే 6A చట్టం ద్వారా కఠిన చర్యలు,
• రేషన్ డీలర్ల నియామకల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టండి,
• ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్, కందిపప్పు, ఉల్లి విక్రయాలు,
• ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీచేసే నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించబోమని అక్రమలకు పాల్పడితే 6A చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలో నూతన రేషన్ దుకాణాల ఏర్పాటుకు డీలర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్, కందిపప్పు, ఉల్లి విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిత్యావసర వస్తువుల పంపిణి డీలర్ల నియామక ప్రక్రియపై శనివారం ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ అధికారులతో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థపై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్డుదారులకు పంపిణి చేయాల్సిన నిత్యావసర వస్తువులను సకాలంలో ప్రతి ఒక్కరికి పంపిణి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నట్లు గుర్తిస్తే ఉపేక్షించేది లేదని 6A చట్టం ద్వారా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గత మూడునెలలలో నిత్యావసర వస్తువుల పంపిణిలో అవకతవకలకు పాల్పడిన వారిపై 6A చట్టం కింద 54 కేసులను నమోదు చేయడంతో పాటు 627 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. రెవిన్యూ అధికారులు వారి పరిధిలో రేషన్ దుకాణాలలో ప్రతి వారం తనిఖీలు నిర్వహించి రేషన్ దుకాణాల నిర్వహణపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణి వాహనాల (ఎండియు)లపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు సజావుగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.కార్డుదారుల సౌకర్యార్థం 800 కార్డులు పైపడిన రేషన్ దుకాణాన్ని రెండు దుకాణాలుగా విభజించి రేషన్ పంపిణి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనంగా 82 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. రేషన్ దుకాణాల ఏర్పాటుకు డీలర్లను నియమించవలసి ఉందని ఇందుకు సంబంధించి రెవిన్యూ డివిజనల్ అధికారులు వారి పరిధిలో ఏర్పాటు చేయనున్న కొత్త డీలర్ల నియామకానికి ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 5న వ్రాతపరీక్ష నిర్వహించడం జరుగుతుం అనంతరం 7వ తేదీన మౌఖిక పరీక్షలు నిర్వహించి అర్హులైన డీలర్ల నియామక ప్రక్రియ 12వ తేదీన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్ దుకాణాలలో బియ్యంతో పాటు జొన్నల పంపిణి :
నిత్యావసర సరుకుల పంపిణిలో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు జొన్నల పంపిణికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా సంబంధిత అధికారులకు సూచించారు. ఇకపై రేషన్ దుకాణాలలో కార్డుదారులకు బియ్యంతో పాటు మూడు కేజీల వరకు జొన్నలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్డుదారులు వారి అభిరుచి మేరకు బియ్యానికి బదులు మూడు కేజీల వరకు జొన్నలు ఉచితంగా పొందే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. జొన్నల పంపిణీకి అవసరమైన ఇండెంట్ లు డీలర్ల నుంచి సేకరించి పంపిణికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, అందుబాటులో ఉంచి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ మార్కెట్లలో రూ.125 ధర ఉన్నపాముయిల్ ను 110 రూపాయలకు, 135 రూపాయల ధర ఉన్నసన్ ఫ్లవర్ ఆయిల్ను 124 రూపాయలకు, కిలో 150 రూపాయలకే కందిపప్పు వినియోగదారులకు విక్రయించేలా పర్యవేక్షించాలన్నారు.
సమావేశంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ర, డిఆర్వో వి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కలెక్టర్ శుభమ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, డీఎస్వో పాపారావు, ఆర్డీవోలు కె. చైతన్య, మాధురి, మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.