Home Andhra Pradesh నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి. పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండండి. యోగాంధ్ర క్యాంపెయిన్‌...

నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి. పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండండి. యోగాంధ్ర క్యాంపెయిన్‌ సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం.

8
0

ఎన్‌టిఆర్‌ జిల్లా తేది:31.05.2025 నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి. పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండండి. యోగాంధ్ర క్యాంపెయిన్‌ సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం. పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ. ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణలో వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ, స్వచ్చంద సంస్థల సహకారంతో పొగాకు వల్ల కలిగే నష్టాల పై ముద్రించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని అన్ని అవయవాలకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్‌తో పాటు పక్షవాతము, అంధత్వము, రక్తనాళాలు గట్టిపడటం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉదన్నారు. ఇప్పటికే పొగాకు, దూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు తమ అలవాట్ల నుండి విముక్తి యోగాతో సాద్యపడుతుందన్నారు. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర క్యాంపయిన్‌ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దన, ప్రాణ, మాన హానికి కారణమవుతున్న పొగాకు, మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్‌ లక్ష్యం సాధనలో భాగంగా ఆరోగ్య కర సామాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలన్నారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపకూడదనే నిబంధనను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతీ యువకులు పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని సూచించారు. స్వచ్చంద సంస్థల ద్వారా కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో పొగాకు దుష్పలితాల అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పొగాకు ఉత్పత్తుల అలవాటు పడిన వారు మానుకునేందుకు జిల్లా ఆసుపత్రిలోని డి`అడిక్షన్‌ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. కోట్పాయాక్ట్‌ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానికంగా పొగాకు నిషేద ఉత్పత్తుల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నేను సైతం ఎన్‌టిఆర్‌ జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మారుస్తానని… సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌లో సంతకం చేసి సంచార అవగాహన వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నేను నా జీవితములో పొగాకు, ఇతర ఉత్పత్తులను వాడను, నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి రక్షించేందుకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం, డియంఅండ్‌ హెచ్‌వో డా. యం సుహాసిని, ఫోరం ఫర్‌ చైల్డ్‌ రౖౖెట్స్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ అరవ రమేష్‌, నవజీవన్‌ బాల భవన్‌ ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ తంబి, ప్రాగ్రాం మేనేజర్‌ శేఖర్‌, కోఆర్డినేటర్‌ జాకబ్‌ రాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here