Home Andhra Pradesh నారావారి పల్లి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్

నారావారి పల్లి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్

4
0

 నారావారి పల్లి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్ 

 స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని.

 చంద్రగిరి

 చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలలో పాల్గొనడానికి బుధవారం రాత్రి 7.25 గంటలకు స్వగ్రామమైన నారావారి పల్లి గ్రామానికి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో గురువారం నిర్వహించే తమ్ముడు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు నారావారిపల్లెకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకాసులకు వేర్వేరుగా శాసనసభ్యులు పులివర్తి వెంకటమణి ప్రసాద్ ( నాని) మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు, శ్యాప్ చైర్మన్ ఏ రవి నాయుడు, టిడిపి నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి, సాదర స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు రాత్రి తమ్ముని కుమారులు నారా రోహిత్, నారా గిరీష్,బంధువులతో, దాయాదులతో కర్మ క్రియల నిర్వహణ, ఏర్పాటుపై చర్చించారు.  

 నారావారిపల్లెలో గట్టి పోలీసు బందోబస్తు.

 మండలంలోని నారావారిపల్లి గ్రామంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్వగృహం నందు జరిగే మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామూర్తి నాయుడు కర్మ క్రియలకు హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీఐపీల రానున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి, చంద్రగిరి డిఎస్పి బి ప్రసాద్, సీఐ సుబ్బరామిరెడ్డిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీల కార్ పార్కింగ్, చెక్ పోస్ట్లు, భోజనశాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here