Home Andhra Pradesh నాటి అరాచకపాలనను కళ్లకట్టిన యువగళం అక్షరరూపం! యువగళంపై పుస్తకాన్ని సిఎంకు అందజేసిన యువనేత లోకేష్ స్తకరూపంలో...

నాటి అరాచకపాలనను కళ్లకట్టిన యువగళం అక్షరరూపం! యువగళంపై పుస్తకాన్ని సిఎంకు అందజేసిన యువనేత లోకేష్ స్తకరూపంలో తేవడం

3
0

నాటి అరాచకపాలనను కళ్లకట్టిన యువగళం అక్షరరూపం! యువగళంపై పుస్తకాన్ని సిఎంకు అందజేసిన యువనేత లోకేష్ స్తకరూపంలో తేవడం అభినందనీయమని ముఖ్యమంత్రి ప్రశంస*కడప: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. 2023 జనవరి 27వతేదీన కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభించి 226రోజులపాటు యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాలను స్పృశిస్తూ 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర జైత్రయాత్రలా సాగింది. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, యాత్రను అడ్డగించేందుకు నాటి వైసిపి ప్రభుత్వం అడగడుగునా సృష్టించిన అడ్డంకులు, ఆనాటి అరాచకపాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటిగాధలను ఈ పుస్తకంలో సచిత్రంగా కళ్లకు కట్టినట్లుగా చూపారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ ను అభినందిస్తూ… యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తకరూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here