Home Andhra Pradesh న‌గ‌ర ప్ర‌జ‌ల‌తోపాటు ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ రోడ్లు ఏర్పాటు : ఎంపి కేశినేని...

న‌గ‌ర ప్ర‌జ‌ల‌తోపాటు ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ రోడ్లు ఏర్పాటు : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 *ప్ర‌చుర‌ణార్థం* *22-03-2025*

న‌గ‌ర ప్ర‌జ‌ల‌తోపాటు ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ రోడ్లు ఏర్పాటు : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

*ఆటోనగర్  లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు  పరిశీలన* 

*బల్లెం వారి వీధి,  మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం, రోడ్, ఘంట‌సాల రోడ్ పరిశీలన* 

*ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు*

విజ‌వాయ‌డ :  కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ తో పాటు,  తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో విజయవాడలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరుగుతుంది. అలాగే ఆటోనగర్ లోకి లారీలు రావటం కష్టంగా మారుతుంది. అందుకని ఫ్లైఓవర్,  మెట్రో కారిడార్ పనులు పూర్తి అయ్యే వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించి, సీఆర్డీఏ ప‌రిధిలోని రోడ్ల‌ను అవ‌స‌ర‌మైన వాటిని విస్త‌రించి, ప్ర‌త్నామ్నాయ రోడ్ల‌ను అభివృద్ది చేసి త్వ‌ర‌గా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. 

న‌గ‌రంలో ఫైఓవ‌ర్, మెట్రో ప‌నులు ప్రారంభ‌మైతే ఆటోన‌గ‌ర్ లోకి లారీలు రావ‌టం క‌ష్టంగా మారుతుంది. భవిష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని, 305 ఎక‌రాల్లో ల‌క్ష‌మంది జీవ‌నం సాగిస్తున్న ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కి ఎలాంటి ఇబ్బందులు క‌లగ‌కుండా న‌గ‌ర శివారుల్లోని క‌న్టెవిటీ రోడ్ల‌ను డెవ‌ల‌ప్ చేసి అందుబాటులో తెచ్చేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్ రావు కృషి చేస్తున్నారు. 

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆధ్వ‌ర్యంలో   సీఆర్డీఏ ప‌రిధిలో వున్న రోడ్ల‌ను ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్   తో క‌లిసి సిఆర్డీఎ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు శ‌నివారం  ప‌రిశీలించారు. ఆటోనగర్ లోని బల్లెం వారి వీధి,  మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్డు, ఘంట‌సాల‌ రోడ్లు పరిశీలించారు.ఆ ప్రాంతాల్లో  పర్యటించి చేపట్టాల్సిన రహదారుల అభివృద్ది పనులతో పాటు  లింక్ రోడ్లను పరిశీలించారు. ఈ రహదారుల్లోకి లారీలు అనుమతి ఇస్తే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వుంటుందనుకున్నారు. అలాగే  గన్నవరం వెళ్లేందుకు  ప్రత్యామ్నాయ మార్గంగా రామవరప్పాడు నుంచి ఎస్.ఎల్.వి గ్రాండ్ మీదు  కేసరిపల్లి కి వెళ్లే రహదారిని పరిశీలించారు. అలాగే ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ సిఆర్డీఏ ప‌రిదిలో క్లియ‌ర్  చేయాల్సిన రోడ్లు, అభివృద్ది చేయాల్సిన మార్గాలు  సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబుకి చూపించారు

అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ  విజ‌య‌వాడ లోని ఆటోన‌గ‌ర్ ప్రాంతం అభివృద్ది చెందితే విజ‌య‌వాడ న‌గ‌ర అబివృద్దికి దోహ‌ద‌ప‌డుతుందన్నారు.  సీఆర్డీఏ లో అమ‌రావ‌తి స‌మ‌స్య‌లే కాదు..సిఆర్డీఏ ప్రాంతంలో వున్న అన్ని రోడ్లు అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. న‌గ‌రంలో ఫై ఓవ‌ర్, మెట్రో ప‌నులు ప్రారంభం అయితే నిడ‌మానురు నుంచి మ‌హానాడు రోడ్డు వ‌ర‌కు మార్గాలు మూసుకుపోతాయి…ఆ స‌మ‌యంలో ఆటోన‌గ‌ర్ కార్మికులు లారీలు రాక ప‌నులు లేక జీవ‌నోపాధి కోల్పోయే పరిస్థితి రాకుండా వుండేందుకు భ‌విష్య‌త్తును దృష్టి లో పెట్టుకుని సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు స‌హ‌కారాంతో ఆటోన‌గ‌ర్ లోకి ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో లారీలు వ‌చ్చేందుకు అభివృద్ది చేయాల్సిన రోడ్లు ప‌రిశీలించ‌టం కోసం రావ‌టం జ‌రిగింద‌న్నారు. 

బ‌ల్లెంవారి వీధి రోడ్డు, దానికి అనుసంధానంగా మ‌హానాడు రోడ్డు నిడ‌మానురువ‌ర‌కు కొన‌సాగింపు,  బ‌ల్లెం వారి వీధి నుంచి నిడ‌మానురు కానురూ క‌లిపే విదంగా రోడ్లు అభివృద్ది చేస్తే ఇటు మచిలీప‌ట్నం నుంచి అటు ఏలూరు, క‌ల‌క‌త్తా నుంచి వ‌చ్చే వాహ‌నాలు  అన్ని సులువుగా  ఆటోన‌గ‌ర్ లోకి రాగ‌లుతాయన్నారు. అందుకే ముందుగా మ‌హానాడు రోడ్డు త్వ‌ర‌గా అందుబాటులో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామ‌న్నారు. 

అనంత‌రం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులపై దృష్టిపెట్టిందని.. ఈ నేపథ్యంలో సమష్టి కృషితో పక్కా ప్రణాళికతో రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 

సీఆర్డీఏ క‌మిష‌న్ క‌న్న‌బాబు మాట్లాడుతూ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు, ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్త‌ర‌ణ , ప్ర‌త్యామ్నాయ మార్గాల అభివృద్ది  ప‌నులు వుంటాయ‌న్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో సిఆర్డీఏ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సునీత‌, సీఆర్డీఏ సీఈ ధ‌నంజ‌య‌,  ఐలా మాజీ అధ్య‌క్షుడు సుంక‌ర దుర్గా ప్ర‌సాద్,  కార్పొరేట‌ర్ ముమ్మ‌నేని ప్ర‌సాద్, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు గుల్ల‌ప‌ల్లినారాయ‌ణ‌రావు, ధ‌నేకుల ఎల‌బంద‌ల‌రావు,  ల‌తోపాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here