నగరాల సామాజిక వర్గానికి మంచి చేసింది ఎవరు మోసం చేసింది ఎవరు.
మంచి చేసిన CM జగన్ కి మద్దతు ఇవ్వకుండా మోసం చేసిన సుజనా వెనక మనీ కోసం సామాజిక వర్గ ముసుగు వేసుకొని తిరుగుతున్న నాయకులను ఏమనాలి.
నగరాల సామాజిక పెద్దలు మరుపిళ్లా చిట్టి తమ్మిన పోతరాజు , పోతిన చిన్నా కోరగంజి శేఖర్ బాబు తదితర నాయకులు నీతి నిజాయితీ నిబద్ధతకు నిదర్శనం గా ఉంటే ప్రస్తుతం కొంతమంది నాయకులు సామాజిక వర్గాన్ని డబ్బులు కోసం వారి వ్యక్తిగత స్వార్థం కోసం వేరే వారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్న వారి మాటలను నమ్మొద్దు.
ఐదేళ్లకు ఒకసారి నగరాల సామాజిక వర్గాన్ని మోసం చేయడం, డబ్బులు సంపాదించడం పరిపాటయింది.
కిందటిసారి నాకు టికెట్ వచ్చినప్పుడు వేరే వారి దగ్గర డబ్బులు తీసుకొని కొంతమంది అమ్ముడుపోయారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత అమ్ముడుపోతున్నారు అమ్ముడు పోవడం వాళ్ళ నైజం
కొంతమంది వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం నగరాల భవిష్యత్ తరాల రాజకీయా అవకాశాలకు సమాధి కడుతున్నారు, ఇట్లాంటి వాళ్లతో సామాజిక వర్గానికి పెను ప్రమాదం పొంచి ఉంది నగరాల్లారా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త
చిట్టినగర్ లో శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ ముసుగులో కొంతమంది నగరాల సమాచారాన్ని అమ్మేస్తున్నారు
చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారు దేవస్థాన కమిటీ కార్యాలయం రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది
ఒక్క రోజుతోనే మార్పు వస్తుందని నేను భావించట్లా నేడు మార్పు మొదలైందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. భవిష్యత్ తరాలకు రాజకీయవారదే నేటి ఆత్మీయ సమావేశం.
స్వచ్ఛందంగా వచ్చే వారికి సంచుల కోసం వచ్చే వారికి చాలా తేడా ఉంటుంది
ఏర్పాటు చేసింది పెళ్లి భోజనం ప్యాకేజ్ భోజనం కాదు
మా సొంత వనరులతో అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రచారం చేస్తున్నాం ఎవరి దగ్గర ఒక్క పైసా ఆశించకుండా ఇదే మా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ
44 డిగ్రీల తీవ్ర ఎండలో నగరాల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన పిల్ల రవికుమార్ మరియు మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు పోతిన వెంకట మహేష్
పిళ్లా రవి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో 250 మందితో నగరాల ఆత్మీయ సమావేశం చిట్టినగర్ శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపం లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు