:-14-12-2024
ధి:14-12-2024 శనివారం ఉదయం 10:00″గం లకు” ఆటోనగర్ KCP సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 13 స్పోర్ట్స్ క్లబ్ CBSC ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ స్పోర్ట్స్ మీట్ 2024కి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- సిద్ధార్థ స్కూల్, కాలేజీలు రాష్ట్రంలోనే గొప్ప గుర్తింపు పేరు తెచ్చుకున్నాయని, LKG TO PG, మెడిసిన్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఎంతోమందికి ఉన్నతమైన చదువును అందిస్తావుందని, తన ఇద్దరు కుమారులు కూడా ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి వారే అని…
ఈ ఇన్స్టిట్యూట్స్ వల్ల చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు లక్షల్లో ఉన్నారని, ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ ను కండక్ట్ చేసి వివిధ స్కూల్స్, కాలేజీల నుండి విద్యార్థులను క్రీడలలో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, టెక్నాలజీ పెరిగిపోయి ఆటలకు దూరంగా ఈరోజు సమాజంలో పిల్లలకు ఫిజికల్ గా వాలీబాల్ కానీ, టెన్నిస్ కానీ, క్రికెట్ గాని ఇటువంటి ఆటలు ఆడడం ద్వారా పిల్లలకు కూడా దృఢంగా తయారవుతారని…
క్రీడలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా ముందు ఉండాలని, రాష్ట్రంలోనే కాక ఏషియా స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి, రాజధాని అమరావతి ని స్పోర్ట్స్ హబ్ గా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని…
విద్యార్థులందరూ చదువుతోపాటు క్రీడలను కూడా నేర్చుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటూక్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…
ఈ కార్యక్రమం లో :-KCP సిద్ధార్థ స్కూల్ కన్వీనర్ శశికళ,ఎలవర్తి శ్రీకాంత్ ,ప్రిన్సిపాల్ కర్మాకర్, వైస్ ప్రిన్సిపాల్ వంశీ కృష్ణ,కొడాలి వంశీ తదితరులు పాల్గొన్నారు…