Home Andhra Pradesh ధి:11-3-2025 మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ప్రభుత్వ విప్,

ధి:11-3-2025 మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ప్రభుత్వ విప్,

3
0

 11-3-2025

 అమరావతి

ధి:11-3-2025 మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని కలిసి ప్రజలపై GO – నెంబర్ 21,31 ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ఆటోలకు మరియు మోటారు సైకిళ్లకు ఫైన్లు విపరీతంగా పెంచి 5000 నుండి 10000 వరకు ఫైన్లు విధించే విధంగా  ఉన్నటువంటి జీవోను తక్షణమే రద్దు చేయమని విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేశారు

 ఈ సందర్భంగా బొండా ఉమా  మాట్లాడుతూ :-2020 వ సంవత్సరం కంటే ముందు ఆటోలకు పెనాల్టీ లు 150 రూపాయల నుండి 500 రూపాయల వరకు మాత్రమే ఉండేవి అని GO-నెంబర్ 21 ప్రకారం 500 రూపాయల నుండి 5000 రూపాయల వరకు పెంచడం జరిగింధి, దీనివల్ల ఆటో కార్మికుల పైన విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడుతున్నది

GO 31 ప్రకారం గ్రీన్ టాక్స్ పేరుతో అటో కార్మికులపై ఆటో కార్మికులపై టాక్స్లు వేయడం ద్వారా ఆటో కార్మికులు ఆర్థిక నష్టానికి గురవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో  ఆటో డ్రైవర్లు  దీర్ఘ కాలికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే గత వైసిపి ప్రభుత్వం 21-10-2020 తేదీన విడుదల చేసిన GO 21 మరియు 12-5-2023 న విడుదల చేసిన జీవో నెంబర్ 31 లను  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది మరియు యువగలం పాదయాత్రలో నారా లోకేష్  హామీ ఇచ్చి ఉన్నారు కావున ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెనువెంటనే జీవో నెంబర్ 21 మరియు జీవో నెంబర్ 31 ప సంహరించి ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు

 ప్రావిడెంట్ ఫండ్(PF) ESI తదితర సౌకర్యాలను ఆటో కార్మికులకు భావన నిర్మాణరంగ కార్మికులకు  ఏర్పాటు చేయవలసినదిగా కోరినారు, ముఖ్యముగా  ఆటో మోటార్ వాహనాల పైన పెండింగ్ లో ఉన్న  పోలీసు వారి E చలానాలను రద్దుచేసి డ్రైవర్లకు ఆర్థిక నష్టాన్ని తొలగించవలసినదిగా బొండా ఉమ  విజ్ఞప్తి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here