01-11-2024
సింగ్ నగర్ పైపుల్ రోడ్డు
ధి: 1-11-2024 శుక్రవారం ఈరోజు సాయంత్రం 4:15″గం లకు” సింగ్ నగర్ పైపుల్ రోడ్డు , విజయ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ కంపెనీ వద్ద “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ లను అందజేయడం జరిగినది …
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా:-సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొని దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసే వాహనాలను జండా ఊపి ప్రారంభించడం జరిగినది…
ఈ సంద్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ముందుగా సంతోషించేది మహిళలు అని…
వైయస్సార్సీపీ ప్రభుత్వం లో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు, మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే అందరిని ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టామని, అంతకుముందు 200 ఉంది పెన్షన్ను తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 చేశామని, తిరిగి 2024లో 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 4000 చేస్తామని ఇచ్చిన హామీ మేరకే ప్రతి నెల 1వ తారీకు ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడు ధి అని…
అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు ఆకలితో పడుకోకూడదు అని ఐదు రూపాయలకు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మూడు పూటలా కడుపునిండా అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని…
గత వైసిపి ప్రభుత్వంలో ఆడవారికి గుదిబండ లాగా మారినటువంటి గ్యాస్ బండను ఎన్నికలకు ముందు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని …
దీపావళి పండుగ సందర్భంగా 850 రూపాయలు ఖరీదు చేసే గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి మూడు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు మిగిలిన హామీ కూడా నెరవేరుస్తామని,రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని , సాధ్యమైనంత త్వరలో తల్లికి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు, చంద్రన్న పాలనలో రామరాజ్యం వచ్చింది అనడానికి ఇదే సంకేతమని బోండా ఉమా చెప్పారు,చంద్రబాబు పాలనలో రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు….
ఈ కార్యక్రమంలో:-సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ శ్రీ,పిరియ జగదాంబ,సుల్తానా,SD గౌసియ, లీల,సరోజినీ, తదితర మహిళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…