21.08.2024
దూరదృష్టి వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్.ఎ.సి లో నారెడ్కో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
విజయవాడ : గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. అందరూ తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర అభివృద్ది చెందాలంటే దూరదృష్టి వున్న నాయకుడు ముఖ్యమంత్రి గా వుండాలి. అలాంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం రాష్ట్రానికే కాదు ప్రజలకి వ్యాపారస్తులకి ఎంతో శుభసూచికమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీ లోని ఎన్.ఎ.సిలో బుదవారం నార్కెడో సంస్థ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈకార్యక్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కేశినేని శివనాథ్ పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులందరూ జ్యోతి ప్రజల్వన చేసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ది చెందిందంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కారణమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపించటానికి శ్రీకారం చుడితే …2019లో వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సి.ఆర్.డి.ఎ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అభివృద్దిను దృష్టిలో పెట్టుకుని కాస్త నిదానంగా వ్యవహరించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా వుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బొడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి, నారెడ్కో సభ్యులు పాల్గొన్నారు.