Home Political news దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

2
0

 దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్పులు చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుజనా చౌదరి నేతృత్వంలో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ గురించి అధికారులతో చర్చించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అన్నదానం, ప్రసాదాలపోటు , ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వాటి పురోగతి వంటి తదితర అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులు  ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకొని మౌలిక వసతులు  కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నారు. జనవరి నాటికి తుది ప్లాన్ ను సిద్ధం చేయాలని  ఎమ్మెల్యే సుజనా ఆదేశించారు.

కార్యక్రమంలో దుర్గగుడి ఈ ఈ వైకుంఠరావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ శ్రీనివాసరావు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధి బోరా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్ , బి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here