09-07-2024
దివ్యాంగుడికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ట్రై సైకిల్ అందజేత
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కి చెందిన దివ్యాంగుడు గోపిశెట్టి తిరునాధం కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ట్రై సైకిల్ అందజేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈ ట్రై సైకిల్ అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఫించన్ ఇచ్చి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.బడుగు బలహీన వర్గాలకు..పేద వారికి సాయం చేయటంలో టిడిపి ముందుంటుందన్నారు . ట్రై సైకిల్ అందజేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి దివ్యాంగుడు గోపిశెట్టి తిరునాధం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.మాధవ, మల్లెపు రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.