దావోస్ పర్యటన. ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు
దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు.
దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.