6-12-2024
దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా
ఆయన దేశానికి చేసిన ఎన్నో సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించిన బొండా ఉమ
ధి:6-12-2024 శుక్రవారం ఉదయం 9:00″గం నుండి” భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్థంతి సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు నియోజకవర్గం లోని 24వ డివిజన్ గిరిపురం రెడ్ సర్సిల్ వద్ద, సాంబమూర్తి రోడ్ బావాజీపేట D మార్ట్ సమీపంలో లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, 58వ డివిజన్ సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి పేదలకు, వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేసి ఘన నివాళులు అర్పించారు…
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :- తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలను ముందుకు తీసుకొని వెళుతూ రాష్ట్రంలోని ప్రజలందరికి సంక్షేమం అందే విధముగా దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేట్టిన 5 రూపాయలకే కడుపునిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ వంటి మంచి కార్యక్రమాలు…
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బొండా ఉమ స్మరించుకుంటూ…
దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని,దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని,ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని…
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే, అంబేద్కర్ మహనీయునికి మనం ఘన నివాళి అర్పించగలమని తెలియజేసారు…
ఈ కార్యక్రమాలలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి 27వ డివిజన్ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు, ఇజ్జడ దుర్గారావు, గడ్డం రాజు, గాజుల రవి, కొండపల్లి రూప్ కుమార్,బేవార వెంకట్రావు, బెజ్జం జయపాల్,మద్దాల చక్రవర్తి,జోగిబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…