Home Andhra Pradesh త్వరలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

త్వరలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

3
0

త్వరలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • రాష్ట్రంలో జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం
  • తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి తీసుకొస్తున్నాం
  • పారిశ్రామిక హబ్ గా రాయలసీమ
  • అనంతపురం-బెంగుళూరు మధ్య భారీ పరిశ్రమల ఏర్పాటు
  • ‘తల్లికి వందనం’పై జగన్ వి తప్పుడు ఆరోపణలు
  • ఈ నెల 21న ‘అన్నదాత సుఖీభవ’ అమలు
  • మద్యం కేసుల్లో మా జోక్యం లేదు : మంత్రి సవిత

గోరంట్ల/శ్రీసత్యసాయి : త్వరలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఆవిర్భవించం ఖాయమని, గత ప్రభుత్వం వేధింపులు తాళలేక రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి తీసుకొస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల 21న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. మద్యం కేసు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని, ఇందులో ఎవరి జోక్యమూ లేదని స్పష్టంచేశారు. జగన్ అరాచక పాలనను తట్టుకోలేక ప్రజలు ఆయన్ను అధికారం నుంచి డైవర్ట్ చేశారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు వచ్చిన సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలుచేస్తున్నారన్నారు. వితంతు, వృద్ధ్యాపు పెన్షన్లతో పాటు దివ్యాంగుల పెన్షన్లు పెంచామన్నారు. స్పౌజ్ పెన్షన్లను కూడా అందజేయబోతున్నామన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ఉచిత ఇసుకతో పాటు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున రహదారులను నిర్మిస్తున్నామన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఇంటర్ కళాశాల్లో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లు, పాఠశాలలకు మరమ్మతులతో పాటు అర్థాంతరంగా నిలిచిపోయిన భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున్న అందజేస్తున్నామన్నారు. అందులో రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహిస్తున్నామన్నారు.

21 నుంచి ‘అన్నదాత సుఖీభవ’ అమలు

ఈ నెల 21న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు కూడా ప్రారంభించామన్నారు. ముఖ్యంగా రాయలసీమను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. అనంతపురం నుంచి బెంగుళూరు మధ్య భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అదే సమయంలో, గత ప్రభుత్వం వేధింపులు తాళలేక రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలను వెనక్కి తీసుకొస్తున్నామని, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరిపారని తెలిపారు. వాటిలో కొన్ని యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల మాదిరిగా పరుగులు తీస్తున్నాయని, త్వరలోనే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆవిర్భవించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

మద్యం కేసుల్లో మా జోక్యం లేదు

మద్యం కేసులో విషయంలో తమ ప్రభుత్వ జోక్యం లేదని, చట్టం తన పని చేసుకుపోతోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. గతంలోనే కల్తీ మద్యం అమ్మకాలపై జగన్ కు అప్పటి ప్రతిపక్ష, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తమ నాయకుడి సూచనలను జగన్ పట్టించుకోలేదన్నారు. చేసిన తప్పులకు ఇప్పుడు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి జగన్ కు వచ్చిందని, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని మంత్రి సవిత తెలిపారు.

జగన్ కు డైవర్షన్ రాజకీయాలు అలవాటే…

ఆది నుంచి డైవర్షన్ రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటేనని మంత్రి సవిత తెలిపారు. తల్లికి వందనం పథకం అమలులో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు. బాబాయ్ హత్య కేసు, తండ్రి మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతి రాజకీయాలు చేయడం అలవాటైన జగన్ ను ప్రజలు అధికారం నుంచి డైవర్ట్ చేశారని ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటైందని, తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here