Home Andhra Pradesh త్యాగానికి ప్రతీక బక్రీద్‌.పండుగ శుభాకాంక్షలు తెలిపిన అబ్దుల్ అజీజ్.రాష్ట్ర ప్రజలందరికీ అల్లాహ్‌ ఆశీస్సులుండాలని కాంక్ష

త్యాగానికి ప్రతీక బక్రీద్‌.పండుగ శుభాకాంక్షలు తెలిపిన అబ్దుల్ అజీజ్.రాష్ట్ర ప్రజలందరికీ అల్లాహ్‌ ఆశీస్సులుండాలని కాంక్ష

2
0

విజయవాడ, 06 – 06 – 2025.త్యాగానికి ప్రతీక బక్రీద్‌.పండుగ శుభాకాంక్షలు తెలిపిన అబ్దుల్ అజీజ్.రాష్ట్ర ప్రజలందరికీ అల్లాహ్‌ ఆశీస్సులుండాలని కాంక్ష. బక్రీద్‌ పండుగ త్యాగానికి ప్రతీక అని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమన్నారు. శనివారం బక్రీద్‌ నేపథ్యంలో ముస్లిం లకు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్‌ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. ఈ పండుగ త్యాగనిరతికి ప్రతీక అని, ఇతరుల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావం చూపాలని పేర్కొన్నారు. త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని, మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్‌ పర్వదినాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. దైవ ప్రసన్నం కోసం తనకిష్టమైన ఎలాంటి వస్తువునైనా త్యాగం చేయాలని ‘ఖుర్బాని’ సంప్రదాయం ప్రతి యేటా గుర్తు చేస్తుందని తెలిపారు. ప్రజలందరికీ అల్లాహ్‌ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here