తొందర్లోనే టెండర్లను పిలిచి పంపు హౌస్ పనులన్నింటినీ మొదలు పెడతాం
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
తొ0దర్లోనే టెండర్లను పిలిచి పంపు హౌస్ పనులన్నింటినీ మొదలు పెడతామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం బెలుగుప్ప మండలం కోనాపురం గ్రామం దగ్గర ఉన్న పంపు హౌస్ ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి.. అనంతరం అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనీవా 11వ పంప్ హౌస్ పనులు దాదాపు 5 సంవత్సరాలుగా ఒక్క అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాయన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కోనాపురం గ్రామం దగ్గర ఉన్న పంపు హౌస్ ను, పంపులను ఏర్పాటు చేయడం, విద్యుత్ పనులు సిద్ధంగా పెట్టడం, ఇందుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే గత ఐదేళ్లలో ఒక్క మీటర్ కరెంటు లైన్, పైప్లైన్ వేయడం గాని చేయలేదని, నిర్లక్ష్యం చేసినప్పుడు పంప్ హౌస్ లో చాలా సమస్యలు వచ్చాయని, ఇంటర్ డిపార్ట్మెంటల్ సమస్యలు వచ్చాయని, ఒకవైపు విద్యుత్ శాఖ, హంద్రీనీవా, భూ సేకరణకు సంబంధించిన రెవెన్యూ శాఖ, తదితర అన్ని శాఖలు రావాలి కాబట్టి ఈరోజు కలిసికట్టుగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పంప్ హౌస్ కి సంబంధించి సబ్ స్టేషన్ కి నిధులు విడుదల చేయడం జరిగిందని, మామూలుగా శాంక్షన్లు చేస్తారని, అలా కాకుండా దీని ప్రాధాన్యత తెలుసు కాబట్టి డబ్బులు కూడా విడుదల చేసామన్నారు. ఈ పంపాస్ కి సంబంధించి ప్రతిపాదనలు అన్ని పాతవి ఉన్నాయని, గత ఐదేళ్లలో కనీసం ప్రతిపాదనలు తయారు వేసి వివరాలు సిద్ధం చేయలేదని, సమయం వృధా అవుతుందని ఉన్న ప్రతిపాదనలకి, పాత ధరలకే డబ్బులు విడుదల చేశామని, అదనంగా పెరిగిన తర్వాత ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకుని పెట్టాలని, టెండర్ పనులు ప్రాసెస్ చేయాలని చెప్పామన్నారు. 12 కిలోమీటర్ల విద్యుత్ లైన్ వేయాలని, ఒక సబ్ స్టేషన్ కట్టాలని, సబ్ స్టేషన్ లో 5 కేవీ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ కావాలి అంటే మార్కెట్లో ఆరు నెలలు పడుతుందని, ఇప్పటినుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫార్మర్ కూడా వేగంగా వచ్చే పరిస్థితి లేదని, మూడున్నర కిలోమీటర్లు స్టీల్ పైపులు వేయాలని, ఇవన్నీటిలో సమయం ఎక్కడికక్కడ ఆదా చేయడం కోసం చూస్తున్నామని, ఇందులో ఏ ఒక్కటి ఆగిపోయినా పని జరగదని, ఆ పనులన్నిటినీ చేయడానికి కాంట్రాక్టర్లను సమావేశానికి పిలిచామని, వారికున్న సమస్యలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సమస్యలను పరిష్కారం చేసి ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అధికారులంతా వారి వారి శాఖల పరిధిలో ఉన్న సమస్యలను అవగాహనకు రావడం జరిగిందని, తొందర్లోనే టెండర్లను పిలిచి ఈ పనులన్నింటినీ మొదలు పెడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.