Home Andhra Pradesh తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోనే 600 మంది మెరిట్ మార్కులు సాధించిన వారికి ₹20,000 వేల...

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోనే 600 మంది మెరిట్ మార్కులు సాధించిన వారికి ₹20,000 వేల రూపాయలు అందించింది

2
0

14-6-2025

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోనే 600 మంది మెరిట్ మార్కులు సాధించిన వారికి ₹20,000 వేల రూపాయలు అందించింది

సెంట్రల్ నియోజకవర్గంలో AKTP ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రణీత్ అనే కుర్రవాడికి 592 మార్కులతో మెరిట్ సాధించిన విద్యార్థికి తన సొంత నిధులతో నగదును అందజేసిన – MLA బొండా ఉమ

ధి:14-6-2025 శనివారం ఉదయం 10:30″గం లకు” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 2024 – 2025 విద్యా సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత కనపరిచిన పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు అయన సొంత నిధులతో ₹2000 వేల రూపాయలు విలువ చేసే స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్, స్టేషనరీ వస్తువులను MLA సంతకంతో కూడిన మెరిట్ సర్టిఫికెట్ లు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతిభ కనబరిచిన 600 మంది విద్యార్థినులకు “షైనింగ్ స్టార్స్” కార్యక్రమం ద్వారా రూ.20 వేల రూపాయల చెక్కులను చేశాము అని, గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్ధులు మెరుగైన మార్కులు సాధిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని

విద్యార్థులు సమాజంలో మంచి, చెడుల పట్ల విచక్షణ కలిగి ఉండాలని, మనదేశంలో సాధారణ స్థాయి నుంచి అత్యంత శిఖరాలకు ఎదిగిన డాక్టర్.APJ అబ్దుల్ కలాం ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఆదర్శంగా తీసుకోవాలని ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి ఎదిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ఆదర్శంగా తీసుకోవాలని, మీ MLA గ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి నేడు ప్రజలకు సేవ చేస్తున్నానని.

ప్రతి విద్యార్థి టాప్ ర్యాంకులను, మార్కులను సాధించడంతో పాటు వారి నైపుణ్యాన్ని కూడా మెరుగుపరచుకుని దానికి అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందించుకుంటూ వారు ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు

విద్యార్థులు ఎప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉండి తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, సెంట్రల్ నియోజకవర్గంలో ని పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అవసరం ఉన్న తనను సంప్రదించాలని, తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్య, స్కూల్ కిట్, బుక్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనంతో పాటు వారి సంక్షేమం కోసం దూరదృష్టితో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, ఇంకా ఎవరికైనా తల్లికి వందనం నగదు జమ కాకపోతే సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని కానీ తనను కానీ సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, MEO 1 సాంబశివరావు, MEO 2 రామారావు, MEO నార్త్ వెంకటేశ్వరరావు, విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here