*29-03-2025*
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
*ముఖ్యఅతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాము, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)*
*ఎంపి కేశినేని శివనాథ్ నేతృత్వంలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు 120 మందికి సన్మానం
విజయవాడ: పేదవారి సంక్షేమం గురించి దేశంలోనే మొదటిసారి ఆలోచించిన మానవతావాది తెలుగు దేశంపార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అయితే…స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ తో సమాజంలో పేదరికం నిర్మూలించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురునానక్ కాలనీలో ని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ నగర పరిధిలో పార్టీ బలోపేతం కోసం సేవలందించిన దాదాపు 120 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా హాజరయ్యారు.
వీరందరితో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నెట్టెం రఘురామ్ పార్టీ జెండా ఎగురువేశారు. ఆ తర్వాత పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు వరుసగా ఎంపి కేశినేని శివనాథ్, నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) వారి సేవలను కొనియాడుతూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ , రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా లను ఎంపి కేశినేని శివనాథ్ శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 43 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ ఉద్యమంలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయం గా ఎన్నో అవకాశాలు లభించాయన్నారు. టిడిపిలో
ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు దేశ నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో కానీ ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా పార్టీ నిలబడుతోందన్నారు. గత ప్రభుత్వం పార్టీ కార్యకర్తలు ,నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా భయపడకుండా మరింత కసిగా ధైర్యంగా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారని, పార్టీకి కార్యకర్తలే బలం బలగం అంటూ తెలుగు తమ్ముళ్లను కొనియాడారు.
ఈ 43 ఏళ్లలో తెలుగు దేశం పార్టీ 23ఏళ్లు అధికారంలో వుంటే 20 ఏళ్లు ప్రతి పక్షంలో వుందని,
అధికారంలో వున్నప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రతి పక్షంలో వున్నప్పుడు సమస్యల పరిష్కరించాలని పోరాటం చేసి, ప్రతి నిత్యం ప్రజల వెంట వుంటున్నామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని మరింత బలోపేతం కి చేసి సమాజంలో పేదరికం నిర్మూలించాలని ఆశయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సలహా మేరకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కి సేవలందించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను గౌరవించుకుందామనే ఉద్దేశ్యంతో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో వాడవాడలా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా వుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజల పక్షంగా టిడిపి వుంటుందన్నారు.
ఆ తర్వాత నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ 1982 లో టిడిపి ఆవిర్భావం పెను సంచలనం సృష్టించిందన్నారు. సామాజిక న్యాయానికి పర్యాయపదంగా తెలుగుదేశంపార్టీ సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 కల్లా ఎపిను అగ్రగామి తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
నాగుల్ మీరా మాట్లాడుతూ పేదవాడికి నిత్యావసరమైన కూడు, గూడు, గుడ్డ నినాదంలో తెలుగుదేశం పార్టీ స్థాపించటం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు అందుకుని కేశినేని వెంకయ్య విజయవాడ నగరంలో ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు.
సన్మానం పొందిన వారిలో టిడిపి సీనియర్ నాయకులు చెన్నుపాటి గాంధీ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న), కోనేరు యుగంధర్, వి.వి.రామారావు, గుమ్మడి కృష్ణారావు, ఎరుబోతు రమణ రావు, గుమ్మడి కృష్ణారావు, గూడపూడి పద్మశేఖర్, ముక్కంటి నారాయణామ్మ,భాను సింగ్ , ముప్పా వెంకటేశ్వరరావు, పరిశపోగు రాజేష్ లతో పాటు ఇతర సీనియర నాయకులు వున్నారు.