Home Political news తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు.

తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు.

3
0

 తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 06.12.2024.

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశ ఔన్నత్యం, సుస్థిర పాలన కోసం రాజ్యాంగ నిర్మాతగా ఆయన శ్రమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. విజయవాడలో రూరల్ మండలంలోని గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో (మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కార్యాలయం) దివంగత నేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటూ నినదించారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా జాతి కోసం, జాతీయత కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, అలుపెరగని పోరాటంతో, స్థిరమైన సంకల్పంతో మన దేశానికి దిశ నిర్దేశం చేసిన ధీశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. 

ఆ దార్శనికుడి స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా, వారి సామాజిక, ఆర్థిక, విద్యా వికాసానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ మహనీయుడి ఆశయసాధనలో ముందడుగు వేయడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నర్రా వాసు, నూతులపాటి నారద, ధారవత్ శ్రీను నాయక్, వీరయ్య, క్రాంతి, రాజు, ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here