21-11-2024
ధి:21-11-2024 గురువారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గం లోని తుమ్మలపల్లి కలక్షేత్రం నందు ప్రపంచ మత్స్య కార దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం,
మత్స్య శాఖ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తోటి శాసనసభ్యులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాససభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం జరిగినది
ఈసందర్బంగా బొండా ఉమా మాట్లాడుతూ :- కడలే ఆధారంగా తీరమే ఆవాసంగా ప్రమాదాలకు వెరవక గంగమ్మనే నమ్ముకొని బ్రతుకు నావనే కాక రాష్ట్రాన్ని అభివృద్ధి తీరాలకు చేర్చే గంగపుత్రులు
కష్టనష్టాలకు కృంగక గంగమ్మనే నమ్ముకుని బతుకు నావనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి తీరాలకు చేర్చే వారు గంగపుత్రులు అని.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 30 కిలోమీటర్లకు ఒక హార్బర్ గాని ఒక జెట్టి గాని ఒక ఫిష్ లాండింగ్ సెంటర్ గాని ప్రభుత్వం ఏర్పాటు చేసి మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తుంది అని.
వేట నిషేధిత భృతి అతిత్వరలో మత్స్యకారులకు అందించనున్నది అని,ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అని
మత్స్యకారులు ప్రతిరోజూ సముద్రంలోకి వెళ్లి, కష్టపడి చేపలు పట్టుకుంటారు వారి కష్టాన్ని గుర్తించడానికి ఈరోజును ప్రపంచ మత్స్య కార దినోత్సవం జరుపుకుంటారు అని.
మత్స్య పరిశ్రమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది,సముద్ర పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన కల్పించడానికి అతిగా చేపలు పట్టడం వల్ల సముద్ర పర్యావరణం దెబ్బతింటుంది ఈ రోజున సముద్రాన్ని కాపాడే విషయంలో అవగాహన కల్పిస్తు ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో వేయకండి అని,సముద్ర ఆహారం మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది అని ఈ సందర్బంగా బొండా ఉమా తెలియజేసారు…