తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడుతో శ్రీవారి ఆలయంలోని
బంగారు వాకిలిలో ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ నూతన పాలకమండలి సభ్యులు రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పాలకమండలి సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వారికి శేషవస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేశారు.