తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు
తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సిఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైప్ లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తిరుపతి పర్యటన పూర్తయిన తర్వాత సీఎం తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లనున్నారు.
మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు.
ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.