తిరిగి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగష్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవడం శుభ సూచికం-బోండా ఉమ

Spread the love

 13-8-2024

58వ డివిజన్ సింగ్ నగర్

తిరిగి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో ఆగష్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవడం శుభ సూచికం-బోండా ఉమ

ది:13-8-2024 మంగళవారం మధ్యాహ్నం 12:30″గం లకు” 58వ డివిజన్ సింగ్ నగర్ లోని అన్న క్యాంటీన్ దగ్గర  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు,టిడిపి పోలిట్ బ్యూరోసభ్యులు బోండా ఉమా  నాయకత్వంలో,బాలాజీ కన్స్ట్రక్షన్స్ దొడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో 250 మందికి మంది పేదలకు అన్నా క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేయడమైనది …

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా:- సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు  పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి న అనంతరం మాట్లాడుతూ;- సెంటర్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా 2014 నుండి 2019 వరకు నారా చంద్రబాబునాయుడు  నాయకత్వంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు  పేరుతో పేదలు ఉద్యోగులు,కార్మికులు,విద్యార్థులు ,యువత ,మహిళల ఆకలి తీర్చేందుకు పౌష్టిక ఆహారారం రూపంలో మధ్యాహ్నం భోజనం రూపంలో కేవలం 5.రూ లతో రోజుకి 15 రూపాయలతో బోజనం పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదే అని..

2019 నుండి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల నోటి కాడ కూడుని లాగేసి,తినడానికి తిండి దొరకకుండా చేసిన అసమర్ధ పాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నరకం చూపించాడు అని…

తెలుగుదేశం పార్టీ మాత్రమే లక్షలాది మందికి ఈరోజు వాటిలో భాగమైన అన్నా క్యాంటీన్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  గతంలో  6 అన్నా క్యాంటీన్లు ఉండేవి అని, వైసిపి ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టేటువంటి విధముగా  2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసేసి ప్రజల కడుపు మీద కొట్టారు అని …

రేపు ఆగష్టు 15 తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అందుబాటులో మూడు పూటలా భోజనం ఏర్పాటు చేసి వారి కడుపు నింపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్నదని  తెలియజేశారు …..

ఈ కార్యక్రమంలో;- టిడిపి రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు,పిరియ సోమేశ్వరరావు,సాంబ్రాణి అమర్నాథ్,సత్యాల చిన్నారవు, బత్తుల కొండ,పైడి శ్రీను,దాసరి ఉదయశ్రీ, దాసరి దుర్గారావు, సర్వేపల్లి అమర్నాద్ ,పత్రి శ్రీనివాస్ (చిన్న),దొట్ట మురళి,P మురళీకృష్ణ,విరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *