West Godavari district/ తణుకు మండలం తేతలిలో గౌతమి స్పిన్ టెక్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని
ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు.
సుమారు రూ. 10లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ కర్మాగారానికి ఫైర్ అనుమతులు ఉన్నాయా , లేవా అని ప్రశ్నలు వస్తున్నాయి