ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన సత్యకుమార్
రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తులు పెంచేందుకు చేయూత ఇవ్వాలని గిరిరాజ్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన సత్యకుమార్
ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి.. మూడు ప్రదేశాల ప్రత్యేకతలను కేంద్ర మంత్రికి వివరించిన సత్యకుమార్
ధర్మవరంలో సిల్క్ పార్క్, మంగళగిరి లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని వినతి.
తన ప్రతిపాదనకు కేంద్ర సానుకూలంగా స్పందించినట్లు తెలిపిన సత్యకుమార్
త్వరలో అమరావతికి వచ్చి అన్ని అంశాలపై చర్చిస్తామని గిరిరాజ్ సింగ్ చెప్పారన్న సత్యకుమార్
మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు సత్యకుమార్ కు చెప్పిన కేంద్ర మంత్రి
చేనేతను ప్రోత్సహించేందుకు, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటా అని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించిన సత్యకుమార్
గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడగా.పర్యావరణ ఉల్లంఘన జరిగిన వివరాలు భూపేంద్ర యాదవ్ కి అందించిన
రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ .