23-04-2024
ఢిల్లీ నుంచి జీజీహెచ్ లో
ని డయేరియా పేషంట్స్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదివారం విజయవాడ జీజీహెచ్ లో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు వున్నయో పరిశీలించాల్సిందిగా తన వో.ఎస్.డి కి ఇతర కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.
కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు వో.ఎస్.డి తో పాటు ఇతర కార్యాలయ సిబ్బంది జీజీహెచ్ లోని డయేరియా షేషంట్స్ వున్న ప్రత్యేక వార్డ్ ను సందర్శించటం జరిగింది. అక్కడ మెడిసన్ హెచ్.వో.డి డాక్టర్ శ్రీనివాసరావు తో మాట్లాడి పేషంట్స్ కి అందుతున్న వైద్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్డ్ లో ఏర్పాటు చేసిన 31 బెడ్స్ ను, 24 గంటలు పేషంట్స్ కి ఆక్సిజన్ అందుబాటులో వున్న ఏర్పాట్లు, డిపిబ్రిలేటర్, కార్డియో, వైటల్ మానిటర్స్ ఏర్పాటు, సిద్దంగా వెంటిలెటర్స్ చూపించటం జరిగింది. ఇప్పటి వరకు నలుగురు పేషంట్స్ చనిపోగా వారిలో జగ్గయ్య పేట మండలంలోని గండ్రాయి గ్రామానికి చెందిన తురకా మంగతాయారమ్మ (70) ఆసుపత్రికి తీసుకువచ్చే మార్గంలో చనిపోయిందని మెడిసన్ హెచ్.వో.డి డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేయటం జరిగింది. ఇక మిగిలిన ముగ్గురు కూడా ఇన్ పేషంట్స్ గా చేరే సమయానికే కిడ్నీలు చెడిపోయి వుండటం, గుండె సంబంధిత సమస్యలు కారణంగా మృతి చెందినట్లు వో.ఎస్.డి కి వివరించారు.
అలాగే డయేరియా బాధపడుతూ ఇన్ పేషంట్స్ గా చికిత్స తీసుకుంటున్న వారితో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వో.ఎస్.డి మాట్లాడి జరుగుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ తొమ్మిది మందిలో ఇద్దరు ట్రావెలర్స్ వుండగా, జగ్గయ్యపేటకు చెందిన వారు ముగ్గురు, విజయవాడ కి చెందిన వారు నలుగురు వున్నట్లు మెడిసన్ హెచ్.వో.డి డాక్టర్ శ్రీనివాసరావు, వో.ఎస్.డి కి చెప్పటం జరిగింది. అలాగే పరిస్థితుల్ని బట్టి అవసరమైతే అదనపు బెడ్స్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దంగా వున్నట్లు తెలియజేశారు. ఈ వార్డ్ లో ఎప్పుడు 24 గంటలు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తో పాటు మరో ముగ్గురు డాక్టర్లు పేషంట్స్ కి అందుబాటులో వుంటారని వో.ఎస్.డికి తెలియపర్చటం జరిగింది.
ఎం.పి వో.ఎస్.డి పేషంట్స్ తో మాట్లాడిన వివరాలు, అక్కడ గమనించిన పరిస్థితులు , డాక్టర్స్ తో మాట్లాడగా వారి చెప్పిన సమాచార వివరాలు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కి తెలియపర్చారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కి చెప్పటం జరిగింది. ఈ సందర్బంగా ఎం.పి కేశినేని శివనాథ్ జీజీహెచ్ వైద్య బృందంతో పాటు సిబ్బంది అందరూ సిద్దంగా వుండాలని వో.ఎస్.డికి చెప్పటం జరిగింది. అలాగే ప్రజలు భయాందోళనలు చెందాల్సినవసరం లేదని, పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలందరూ కాచి చల్లారిన నీరు తాగాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.