డీటీసీ కార్యాలయం, విజయవాడ. తేదీ: 26.01.2025
డీటీసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన డిటిసి ఎ మోహన్
దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులను నేటి తరానికి మనమందరం తెలియచెప్పాలని డిటిసి ఎ మోహన్ అన్నారు.
స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయంలో ఆదివారంనాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో డీటీసీ ఎ మోహన్ పాల్గోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా డీటీసీ ఎ మోహన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షునిగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకున్నామని, ఈ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వ నిర్మాణం, పరిపాలన వ్యవస్థ నిర్దేశించబడ్డాయన్నారు. అప్పటినుండి స్వతంత్ర గణతంత్ర భారతదేశముగా ఆవిర్భవించిందని
గుర్తు చేసారు. ఎందరో మహానుభావులు అందించిన స్వాతంత్రం ఫలితంగానే మనమందరం ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు.
బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ప్రజలకు సేవలు చేసే అవకాశం ఉద్యోగులుగా మనకు దక్కడం ఎంతో అదృష్టమన్నారు. శాఖాపరంగా ప్రజలు కోరుకునే సేవలను జిల్లాలోని అధికారులు ఉద్యోగులు సత్వరమే పరిష్కారించి పారదర్శకతతో సేవలను అందించాలని అప్పుడే దేశానికి మనం సేవ చేసినట్లవుతామని డీటీసీ ఎ మోహన్ అన్నారు. శాఖపరంగా అవలంబిస్తున్న విధి విధానాలన్నీ కూడా రవాణా చట్టానికి లోబడి ఉంటాయని చట్టాలపై అధికారులకు ఉద్యోగులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, వై నాగేశ్వరరావు, ఙివిఎస్ ఎన్ మూర్తి, కె శివరామ గౌడ్, ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు, కార్యాలయ పరిపాలనాధికారులు అబ్దుల్ సత్తార్, చంద్రకళ, పోర్ట్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె భద్రాచలం, అధికారులు ఉద్యోగులు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్, హోం గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.