*21.11.2024*
టీడీపీ తరఫున సర్పంచ్ గా పోటీ చేసినందుకు వైసీపీ ఎమ్మెల్యేకు కక్ష.. టీడీపీ నేతపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇబ్బందులు
ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేసిన వైసీపీ పునరుద్ధరించి రైతులకు మేలు చేయాలని విజ్ఞప్తి
అక్కపై తమ్ముడు దాడి.. చేయి విరగ్గొట్టి వేధింపులు
మన్యం జిల్లా భామిని మండలానికి చెందిన రాజేష్ విజ్ఞప్తి చేస్తూ.. తాను ఎస్సీ మాదిగనని.. గత వైసీపీ ప్రభుత్వంలో భామిని పంచాయితీ సర్పంచ్ గా తన భార్య పోటీ చేసి టీడీపీ తరఫున గెలవడంతో.. కక్ష పెంచుకున్న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కళావతి.. స్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేయిస్తున్న తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిందని.. తనపై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను తొలగించేలా చూడాలని నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్వచ్ఛా ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశాడు. అర్జీ స్వీకరించిన నేతలు తగిన న్యాయం జరిగేలా చూస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు.
• మన్యం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామానికి చెందిన ఎన్. గణేష్ విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వంలో తమ గ్రామానికి రూ. 18 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు అయ్యిందని తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకోలేదని. దాంతో నాలుగు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని.. దయచేసి గతంలో మంజూరైన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు కూటమి ప్రభుత్వం మేలు చేయాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వీరా రెడ్డి పల్లెకు చెందిన కోటి రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. వారసత్వంగా సంక్రమించిన తమ భూమికి అన్ని డాక్యుమెంట్లు ఉండి భూమిని విక్రయించబోగా.. భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు అంటున్నారని.. దయచేసి తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• శ్రీకాకుళం జిల్లా ఎల్ ఎన్ పేట మండలానికి చెందిన జిల్లా పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ఒమ్మి ఆనందరావు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంతో పాటు పరిసరాల్లో పది పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ చదువుకోవాలంటే చాలా దూరం వెళ్లవలసి వస్తోందని.. మండలంలోని కరకవలస గ్రామంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందిని తొలగించాలని విజ్ఞప్తి చేశాడు.
• తన పిల్లల చదువుకు ఇంటిని బ్యాంక్ లో లోన్ గా పెట్టి డబ్బులు తీసుకోవాలంటే కన్విన్స్ డిడి అడుగుతున్నారని.. కన్విన్స్ డిడి కొరకు హౌసింగ్ కొర్పొరేషన్ వారికి అర్జీ పెట్టుకుని మూడు నెలలు గడిచినా పట్టించుకోలేదని.. తన పిల్లల చదువుకు వెంటనే డబ్బులు కట్టాలని.. తనకు కన్విన్స్ డిడి ఇప్పించి ఆదుకోవాలని శ్రీకాకుళంకు చెందిన కొత్తకోట రామకృష్ణారావు విజ్ఞప్తి చేశాడు.
• అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం పుల్లంపేట మండలం దేవ సముద్రం గ్రామానికి చెందిన చింత పిచ్చమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త చనిపోతే తాను 20 సంవత్సరాల క్రితం తన పుట్టింటికి వచ్చి తన తమ్ముడైన రమణారెడ్డి ఇంట్లో ఉంటుంటే.. తన మరో తమ్ముడు తనను అకారణంగా కొట్టి ఇబ్బందులు పెడుతున్నాడని.. తనను రమణారెడ్డి ఇంట్లో నుండి వెళ్లగొడుతున్నాడని.. తన చేయి విరగ్గొట్టాడని.. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె నేడు గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేసింది
• కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి… చిన్నాయిపాలెం గ్రామాల మధ్య పచ్చని పంట పొలాలు ఉన్నాయని అక్కడ విమానాశ్రయం ప్రతిపాదనతో వార్తలు వస్తున్నాయని.. దాన్ని రద్దు చేసి మరోక చోట విమానాశ్రయం ను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు.