Home Political news టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన ఎన్డీఏ కార్యాలయం

టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన ఎన్డీఏ కార్యాలయం

3
0

 టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన ఎన్డీఏ కార్యాలయం

 

చిట్టినగర్ 47 వ డివిజన్ టెనర్ పేటకు చెందిన టీడీపీ కార్యకర్త బండి మల్లేశ్వరరావు(38) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నిరుపేదలైన వారి కుటుంబానికి సాయం అందించాలని 47 వ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు తెలపగా ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో బాధిత కుటుంబ సభ్యులకు రూ 5,వేల ఆర్థిక సహాయాన్ని కూటమి నాయకుల చేత ఆదివారం అందించారు.

మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వారు తెలిపారు. 

ఎన్డీఏ కూటమి నేతలు నాగోతి రామారావు, వేరుకొండ ఉమాకాంత్, వేంపలి గౌరీ శంకర్, ఎం ఈశ్వర్, పోతినీడి లోకేష్, కట్టా సాంబయ్య, డి శ్రీనివాస్ ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది చింతా సృజన్ (బాబీ) సుజనా మిత్రా సిబ్బంది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here