42వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ చైతన్య రెడ్డి నా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు అని సముల వేంకటేశ్వర రెడ్డి అన్నారు.
భవానిపురం పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసిన తిరిగి నాపై కేసు నమోదు చేశారు.
వైసీపీ కార్పొరేటర్ మూడు సంవత్సరాల నుండి నా స్థలంలో అద్దె కట్టకుండా కార్యాలయాన్ని నిర్వహించారు.
స్పందనలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదు
ఈ స్థలం నాది నెలకు రూ. 65000 ఈఎంఐ కడుతున్నాను.
అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీదే ఉన్నాయి.
వైసిపి కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు.
నాకు జనసేన సభ్యత్వం ఉంది.
వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు.
ఈ స్థలం అమ్మలని నాపై దాడిలు కూడా చేయించారు.
గతంలో ఈ స్థలంలో నా భార్య నేను నిరసన దీక్షలు కూడా చేశాం.
ప్రధాని నరేంద్ర మోడీ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని నాకు న్యాయం చేశారు.
టిడిపి ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరిగింది అని సాములా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.