జేఎన్టీయూకే అనుబంధం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో విచారణ జరిపించాలి
విజయవాడ: జేఎన్టీయూకే అనుబంధం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయని తక్షణమే విచారణ జరిపించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏపీ టి పి ఐ ఈ ఏ అధ్యక్షులు ఎం.వి బ్రహ్మానంద రెడ్డి మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీ టి పి ఐ ఈ ఏ) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ గుంటూరులోని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (JNTUK అనుబంధ)లో నకిలీ ప్రిన్సిపాల్, నకిలీ Ph.D సర్టిఫికెట్తో ఉన్న వ్యక్తి, విద్యా మరియు పరిపాలనా వ్యవస్థను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, UGC నిబంధనలకు విరుద్ధంగా M.Tech (CSE) రెగ్యులర్ కోర్సును నడుపుతున్నాడు. ఈ విషయం పుష్కల ఆధారాలతో నిరూపించబడింది.ఇలాంటి అక్రమ చర్యలు మన సాంకేతిక విద్యా వ్యవస్థ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకే ముప్పుగా మారతాయి.APTPIEA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యాశాఖను మరియు JNTUK అధికారులను తక్షణ, కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో నైతిక విలువలు మరియు నాణ్యతను పునరుద్ధరించేందుకు
గత దశాబ్ద కాలంగా అనుబంధ విశ్వవిద్యాలయాలుగా ఉన్న జేఎన్టీయూకే అనుబంధిత మరియు స్వయంపాలిత కళాశాలలపై సముచిత పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయడంలో విఫలమైందని దీనివల్ల అనేక సమస్యలకు దారితీసింది అని అన్నారు.జేఎన్టీయూ విజయనగరం ఉపాధ్యాయుల పోస్ట్లులలో తప్పుడు జీవోలు జారీ చేసి కొందరు పదోన్నతులు పొందారని అన్నారు.అలాగే జేఎన్టీయూ విజయనగరం నుండి జేఎన్టీయూ కాకినాడ దాకా తప్పుడు జీవోలు ఇచ్చారని, ఈ తప్పుడు జీవోల వల్ల జేఎన్టీయూ కాకినాడ వీసీ పై కేసు నడుస్తుందనీ, అయినా కూడా వీసీ పోస్టు గత ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలా చాలామంది తప్పుడు జీఓల ద్వారా ఉన్నత పదవులు పొందారని ఆరోపించారు. అంతేకాకుండా నకిలీ జీవోల వల్ల నకిలీ పదోన్నతులు పొంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై విద్యార్థుల భవిష్యత్తును రక్షించడానికి ప్రభుత్వ విద్యాశాఖ మరియు సంబంధిత ఉన్నతాధికారులు అన్ని కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.