Home public news జివో నంబర్ 5&6 ల నిలుపుదల హర్షణీయం

జివో నంబర్ 5&6 ల నిలుపుదల హర్షణీయం

3
0

 జివో నంబర్ 5&6 ల నిలుపుదల హర్షణీయం

ఆంధ్రప్రదేశ్ “ఎంఎస్ఎంఇ” ఇండస్ట్రీస్ అసోసియేషన్ 

విజయవాడ,మార్చి 11:ఆటోనగర్ వాసులను నిద్ర లేకుండా చేసిన జి.వో నంబర్ 5&6 లు నిలపు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ “ఎంఎస్ఎంఇ” ఇండస్ట్రీస్ అసోసియేషన్ విజయవాడ సభ్యులు అన్నారు. 

మంగళవారం ఆటోనగర్ లోని అసోసియేషన్* విజయవాడ ఆటో క్లస్టర్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ ఇఆర్ మలినేని నారయణ ప్రసాద్ కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోవారు మాట్లాడుతూ జివో నంబర్ 41 తెచ్చిన ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు కి ,ఎంపి శివ నాధ్ కు,ఎమ్మెల్యే గద్దే రాంమోహన్ రావుకు  కృతజ్ఞతలు తెలిపారు.

యాభై సంవత్సరాల క్రితం ఏ‌పి‌ఐ‌ఐ‌సి వారినుండి అప్పట్లో మార్లెట్ రేటుకంటే ఎక్కువ వెచ్చించి ఆటోనగర్ లో పరిశ్రమల కోసం భూములను కొనుక్కొని గొప్ప అభివృద్దిని తీసుకొని రావడానికి, ఆటోనగర్ వాసులు కృషి చేసి, ఆసియాలోనే గొప్ప ఆటోనగర్ గా పేరు తెచ్చిన ఘనత మన ఆటోనగరిది. 

కోఆర్డనేట్ గ్రూప్ పాలసి పేరుతో గత  ప్రభుత్వము జీవో నెంబర్ 5&6 లు అమలు లోకి తీసుకోని వచ్చురు. ఆటోనగరలముల చుట్టూ పట్టనము అభివృద్ది అయిననందున ప్లోట్లను మార్కెట్ విలువలో 50 శాతము ఇంపాక్ట్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు చెల్లించి కమర్షియల్ గా మార్చుకోమని  వత్తిడి తెచ్చేరు.  50 శాతం కట్టి కమర్షియల్ చేసుకోవాలని చెప్పడం, దీనికి లాండ్ కన్వర్షన్ చార్జీలు ఏగస్ట్రా దారుణమన్నారు మొ య లేని భారమని, ఇక్కడ అందరూ చిన్న మోటారు మెకానిక్కులు, చిన్న పరిశ్రమలు వున్నందున జీఓ ను నిలుపుదల చేయమని, ఇది పారిశ్రామిక అభివృద్దికి నిరోదము కాగలదని, వెంటనే రద్దు చేయవలసినదిగా ప్రభుత్వమును కోరడమైనది. 

పరిశ్రమలు వెరోచోటికి తరలించి కొనస్సాగటము దుర్లభమని, పరిశ్రమలు కాయిలా పడిపోతాయని అందరూ ఆందోళన వ్యక్తము చేశారు. జవహర్ ఆటో నగర్ చిన్న కార్మికులు ఉండే ఆటోనగర్ స్వయం కృషి తో ఏదిగింది. సంవత్సరానికి 1500 కోట్ల రుపాయలు రెవిన్యూ ఇస్తున్నామని అన్నారు.ఎన్నో అటుపోటులకు తట్టుకోని ఇప్పుడే నిలదోక్కుకునే సమయంలో ఖాళి చేయమని చెప్పారని అన్నారు. ఆటో నగర్ తో ఈ ఏరియల్ వారందరికీ అనుబందం ఉందన్నారు. 

ప్రభుత్వము వినని క్రమంలో హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు వారు యధాస్థితిని కొనసాగించాలని ఫరధర్ ఆర్డర్ వచ్చే వరకు ఇంఫాక్ట్ ఫీజు ,కోఆర్డనేట్ పాలసిని కాని ఇంప్లిమెంట్ చేయవద్దని తెలిపారని అన్నారు. 

అనంతరం ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి పారిశ్రామిక ప్రగతికి జివో 41 తీసుకువచ్చారని అభివృద్ధి కి అటంకంగా ఉన్న  5&6 జివోలను రద్దు చేశారని అన్నారు. 

అలాగే ఓపెన్ లాండ్,వేకేండ్ లాండ్ టాక్స్ లు సెట్ బ్యాక్ టాక్సులను 100శాతం నండి 16 వందల శాతం పెంచిందని  ఆటాక్సులపై కూడ ప్రభుత్వం తో చర్చలు జరిపామని ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించిందని అన్నారు. ముఖ్యమంత్రి నార చంద్ర బాబు రాష్ట్రంలో ఉన్న ఆటో నగర్ కార్మికులకు సహయ సహకారాలు అందించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో ఎపిఎంఎస్ ఎంఇఎ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు,ఎపి ఎంఎస్ఎంఈ ఐ ఏ జనరల్ సెక్రెటరీ ఎమ్మెస్ రామచంద్రరావు, టీవీ నాగేశ్వరరావు వి ఐ ఈ ఎం ఏ కార్యదర్శి, దుర్గాప్రసాద్ చైర్మన్ ఏపీ ఐ ఐ సి,ఐలా, వినోద్ బాబు చైర్మన్ జెఆర్డీ టాటా ఐలా, మాజీ కార్యదర్శి ఎం ఎస్ ఎం ఇఐఎ,రమేష్.బాబు ,సాంబశివరావు, వై మూర్తి,వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here