Home Andhra Pradesh జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత

జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత

2
0

 జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత

కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు

కేసు నమోదు…సీజ్ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత

నగదు పట్టుకున్న విషయాలపై మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి

 జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ సర్కిల్ లో మంగళవారం ఉదయం టూటౌన్ సి.ఐ క్రాంతికుమార్, ఎస్సై రుష్యేంద్ర బాబు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇంఛార్జి భీమలింగేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు

అటు వైపుగా వచ్చిన ఫార్చునర్ వాహనాన్ని వాహనాల తనిఖీ పోలీసులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. అందులో రెండు బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1,99,97,500/- నగదును పోలీసులు సీజ్ చేశారు

ఫార్చునర్ వాహనం రికార్డులను పరిశీలించగా…సదరు వాహనం కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్నట్లు తేలింది.

డ్రైవర్ వెల్లడించిన అంశాలను ఆధారంగా చేసుకుని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు

 సీజ్ చేసిన నగదు రూ. 1,99,97,250/- నగదును తదుపరి చర్యల నిమిత్తం అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టూటౌన్ పోలీసులు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here