జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడలోని బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా
కళాశాలలోని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. భద్రత పరంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని.. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ పకడ్బందీగా ఉండాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా 40,608 మంది విద్యార్థులకు గాను 39,686 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదు