Home Andhra Pradesh జిల్లా ఆర్ టి ఓ ఆఫీస్ అధికారులతో ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు సమావేశంప్రెస్ న్యూస్...

జిల్లా ఆర్ టి ఓ ఆఫీస్ అధికారులతో ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు సమావేశంప్రెస్ న్యూస్ తిరుపతి ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ శాఖ మరియు జాతీయ ప్రెసిడెంట్ పి.చంద్ర మోహన్

7
0

జిల్లా ఆర్ టి ఓ ఆఫీస్ అధికారులతో ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు సమావేశంప్రెస్ న్యూస్ తిరుపతి ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ శాఖ మరియు జాతీయ ప్రెసిడెంట్ పి.చంద్ర మోహన్ సూచనల మేరకు, ఇటీవల తిరుపతి లో ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కె.అజయ్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,జాతీయ శాఖ సభ్యులు ఐన ఎన్.రేవతి,తిరుపతి జిల్లా ఎఫ్ ఆర్ టి ఐ టీమ్ తో కలసి, తిరుపతి జిల్లా రీజినల్ ఆర్ టి ఓ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు , ఆర్ టి ఓ ఆఫీస్ ప్రధాన బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు మరియు ఆర్ టి ఓ ఆఫీస్ అధికారులతో సమావేశం అయ్యారు.ఈ సమావేశం లో టూ వీలర్స్, ఫోర్ వీలర్ వాహన దారుల ఎల్ ఎల్ ఆర్, ప్రధాన లైసెన్స్ లు అందరివీ కూడా,వారి స్లాట్స్ బుకింగ్ టైమ్ లో పారదర్శకంగా జరిగేలా చూడాలని,ఆర్ టి ఓ ఆఫీస్ లో వాహన దారుల డ్రైవింగ్ చెక్ చేసే ఏరియాలో, డ్రైవింగ్ మెళుకువలు,రోడ్స్ మ్యాపింగ్ సిగ్నల్స్ కు సంబంధించిన సూచికలు, ట్రాఫిక్ నిబంధనలతో కూడిన బోర్డులు, విరివిగా పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే వారికి,ప్రజలు అందరి సౌకర్యార్థం కూడా అవగాహన కల్పించాలి అని ఆఫీసర్స్ ను కోరారు.అలాగే అన్ని వెహికల్స్ లైసెన్స్ లు, ఇచ్చేటపుడు,ముఖ్యంగా టూరిస్ట్ వాహనాలు, దూరప్రాంత వెహికల్స్,పెద్ద లోడ్ తో ఉండే లారీ లు, టిప్పర్ లు,గాట్ రోడ్ వెహికల్స్, నిత్యము సిటీ లో విద్యార్ధులు,చిన్న పిల్లలు తో ప్రయాణించే స్కూల్స్, కాలేజీల బస్సులు, వ్యాన్లు, మొదలైనవి అన్ని వాహనాలు కండిషన్ కరెక్ట్ గా ఉంటేనే సర్టిఫై చేసి,క్రమ పద్ధతిలో చెక్ చేసి ఆర్ టి ఓ ,సంబంధిత శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనాలును ఆన్ రోడ్ మీదకు పంపాలని, వెహికల్స్ లో ఇంజన్ ప్రాబ్లెమ్,ఇతరత్ర సమస్యలు ఉంటే మెకానిక్ సర్వీస్ సెంటర్ కు రిఫర్ చేసి వాహన కండిషన్ బాగున్న తర్వాత ధ్రువీకరించి రోడ్ వినియోగం లోకి వచ్చేలా జాగ్రత్త లు తీసుకుని,ఆర్ టి వో ఆఫీసు నుంచి ప్రజలకు పారదర్శకతతో మంచి సేవలు అందించి, ఆక్సిడెంట్స్ , ప్రాణా పాయాలు ను తగ్గించే విధంగా, చూడాలని ఆర్ టీ ఓ ఆఫీసర్స్ ను సెక్రటరీ అజయ్ ప్రసన్న కుమార్,ఎఫ్ ఆర్ టి ఐ ప్రతినిధులు కోరారు.ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ శాఖ గురించి,గవర్నమెంట్ తో అనుసంధానంగా ప్రజల పక్షాన స్వచ్ఛందంగా చేపడుతున్న అవేర్నెస్ మీటింగ్స్, కార్యక్రమాల నిర్వహణ గురించి అధికారులకు వివరించటం జరిగింది.లీగల్ చట్టాలతో కూడిన ఎఫ్ ఆర్ టి ఐ కొత్త 2025క్యాలెండర్స్ ను ఆర్ టీ ఓ ఆఫీస్ అధికారులకు అందించటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ టి ఓ ఆఫీస్ లో అధికారులుకు, ఎఫ్ ఆర్ టి ఐ ప్రతినిధులకు వీటి మీద అవేర్నెస్ కార్యక్రమం జరిగింది.ఆర్ టి ఐ యాక్ట్ ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని డిపార్ట్మెంట్ లోని అధికారుల నుంచి సకాలంలో అందేలా చూడాలని అజయ్ ప్రసన్న కుమార్ కోరగా,త్వరిత గతిన వాహన దారులకు,ప్రజలకు సమాచారం ఇస్తామని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ టి ఐ తిరుపతి జిల్లా స్పోక్స్ పర్సన్ డాక్టర్ కరాటే చంద్ర శేఖర్, జనరల్ సెక్రటరీ వెంకట్,మహిళా అధ్యక్షులు సూర్య కుమారీ,ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గుణ శేఖర్,లీగల్ వింగ్ ప్రెసిడెంట్ మహా లక్ష్మీ,వివిధ శాఖల నాయకత్వాలు నాగరాజు రాయల్, సుజాత ,వేణు గోపాల్, రూపేష్,దాము,ప్రవీణ్, శివ,రాజేష్ తదితర ఎఫ్ ఆర్ టి ఐ టీం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here