Home Andhra Pradesh జాతీయ రహదారుల విస్తరణ, అవుటర్‌ రింగ్‌రోడ్‌లకు భూసేకరణ వేగవంతం చేయండి

జాతీయ రహదారుల విస్తరణ, అవుటర్‌ రింగ్‌రోడ్‌లకు భూసేకరణ వేగవంతం చేయండి

2
0

ఎన్‌టిఆర్‌ జిల్లా
తేది: 17.06.2025

      జాతీయ రహదారుల విస్తరణ, అవుటర్‌ రింగ్‌రోడ్‌లకు భూసేకరణ వేగవంతం చేయండి
        మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణకు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేయండి
                        జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ. 

విజయవాడ - హైదరాబాద్‌ సెక్షన్‌ లో జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65ను ఆరు లైన్ల రహదారిగా విస్తరణ, పెడన ` విసన్నపేట 216ఎన్‌హెచ్‌  జాతీయ రహదారి విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణకు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌  పనులను వేగవంతం చేసి నివేదికలను సమర్పించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు.

 జాతీయ రహదారుల విస్తరణ, అవుటర్‌ రింగ్‌రోడ్‌లకు భూసేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణకు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహణ వంటి పలు అంశాలపై మంగళవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ – విజయవాడ ఎన్‌ హెచ్‌ 65 రహదారికి సంబంధించి 226 కి.లో మీటర్ల ఆరు లైన్లల విస్తరణలో భాగంగా నందిగామ డివిజన్‌లోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగ్రంచిప్రోలు మండలాలలో జాతీయ రహదారుల అధికారులకు ఎన్‌జాయిమెంట్‌ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసి ఉందన్నారు. అనుమంచిపల్లి, షేర్‌మహమ్మద్‌పేట, తోటచర్ల, భీమవరం గ్రామాలకు సంబంధించి ఆయా మండల తహాశీల్థార్లు ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెడన `విసన్నపేట 216 ఎన్‌హెచ్‌ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి జిల్లాలో విసన్నపేట తిరువూరు మండలాలలో 9 గ్రామాల నుండి ప్రతిపాదనలు రావాల్సి ఉండగా 5 గ్రామాలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, మిగిలిన గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్‌డివోకు సూచించారు. అవుటర్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల అధికారులు అవసరమైన భూమికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని రికార్డులను పరిశీలించి 3ఏ రిపోర్టు తయారు చేసి పంపాలన్నారు. ఇందుకు సంబంధించి కంచికచర్ల, మైలవరం, జి. కొండూరు మండలాలలో 3ఏ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జాతీయ రహదారి గ్రీన్‌ఫీల్డ్‌ ఎలైన్‌మెంట్‌ సంబంధించి 273 ఎకరాలకు గాను 243 ఎకరాలను సేకరించడం జరిగిందని మిగిలిన 30 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు 3ఏ నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి భూములను సర్వే చేసి 3డి రికార్డులను సమర్పించాలన్నారు. భూములను సర్వే చేసేందుకు సర్వేయర్లు అందుబాటులో లేకుంటే ఇతర మండలాల నుండి సర్వేయర్లను డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌డివోకు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ సూచించారు.

సమావేశంలో విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్‌డివోలు కె. చైతన్య, కె. బాలకృష్ణ, కె. మాధురి, ఎన్‌్‌ హెచ్‌ ఎఐ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు  ఎం.విద్యాసాగర్‌ (విజయవాడ), ఎం రామాంజనేయ రెడ్డి (ఖమ్మం), టి. పార్వతీశం (అమరావతి), సంబంధిత మండలాల తహసిల్దార్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here