Home Political news జ‌ర్న‌లిస్టు స‌మ‌స్య‌ల‌పై ఎంపీకి విన‌తి ప‌త్రం సానుకూలంగా స్పందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

జ‌ర్న‌లిస్టు స‌మ‌స్య‌ల‌పై ఎంపీకి విన‌తి ప‌త్రం సానుకూలంగా స్పందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

4
0

 జ‌ర్న‌లిస్టు స‌మ‌స్య‌ల‌పై ఎంపీకి విన‌తి ప‌త్రం

సానుకూలంగా స్పందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ:- అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థ‌లం కేటాయించాల‌ని, ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో జ‌ర్న‌లిస్ట్ పిల్ల‌ల‌కు 50 శాతం పీజు రాయితీ ఇప్పించాల‌ని కోరుతూ ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్య‌క్షుడు చంద‌న మ‌ధు ఆధ్వ‌ర్యంలో ప‌లువురు స‌భ్యులు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఎంపి శివ‌నాథ్‌ను క‌లిసి పుష్పం గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని జీవో నెంబర్ 535 జారీ చేసి మోసం చేసిన సంగ‌తి వివ‌రించారు. జ‌ర్న‌లిస్టులు చెప్పిన స‌మ‌స్య‌లు విన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి ఈ స‌మ‌స్య‌లు తీసుకువెళ్లి వీలైనంత త్వ‌రగా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌న్నారు. కార్య‌క్ర‌మంలో అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షుడు సర్వారావు, వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి పూర్ణచంద్రరావు, స‌భ్యులు రాష్ట్ర కార్యదర్శి మనేపల్లి మల్లిఖార్జునరావు, రాము, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here