జర్నలిస్టులపై దాడులు అరికట్టి రక్షణ కల్పించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు
నిజాన్ని నిర్భయంగా రాస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ, అవినీతిని ఎండగడుతున్న “న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ భాసూరు సాయి” పై శ్రీకాకుళం లో జరిగిన దాడిని హోమ్ మినిస్టర్ అనిత దృష్టికి తీసుకువెళ్లిన “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు.
అమరావతి, వార్తా ప్రపంచం
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం తో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ మరియు జర్నలిస్టులపై దాడి కట్టడానికి కట్న చట్టాలు అమలు చేసే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది..
ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ని కలసి జర్నలిస్టులపై దాడులు అరికట్టి రక్షణ కల్పించాలని, జర్నలిస్టుపై దాడులకు నివారణకు కఠిన చట్టాలు అమలు చేయాలని వినతి పత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు…
నిజాన్ని నిర్భయంగా రాస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ, అవినీతిని ఎండగడుతున్న న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ భాసూరు సాయి పై శ్రీకాకుళం లో సవాలాపురపు తేజశ్రీ వర్గం చేసిన దాడిని “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు హోమ్ మినిస్టర్ అనిత దృష్టికి తీసుకువెళ్లారు.. భాసూరు సాయి కి రక్షణ కల్పించి తప్పుడు కేసులు ఎత్తివేయాలని హోం మినిస్టర్ వంగలపూడి అనిత కు వినతిపత్రం అందజేశారు.. దీనిపై వెంటనే స్పందించిన హోం మినిస్టర్ అనిత రాష్ట్ర డిజిపి కి సిఫార్సు చేశారు..
ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులకు తెలియచేసారు. జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలియజేశారు..
అనంతరం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఎడిటర్ భాసూరు సాయి పై జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమని, విధి నిర్వహణలో భాగంగా నిజాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచిన
న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ భాసూరు సాయి పై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది పత్రికా స్వేచ్ఛ పై ప్రత్యక్ష దాడిగా “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” భావిస్తుందని ప్రెసిడెంట్ డాక్టర్ సురేంద్ర బాబు తెలిపారు. జర్నలిస్టులు అంటే కుల, మత, ప్రాంత పార్టీ బేధాలు లేకుండా ప్రతి ఒక్క వార్త ను కవరేజ్ చేస్తారు. అలా చెయ్యేటమే తప్పు అంటూ విలేకరుల పైన దాడి చెయ్యటం జర్నలిస్టులకు కల్పించిన హక్కులను హరించే ప్రయత్నం చేయడమేనని, వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి దీని వెనుక ఎంతటి వారున్నా చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” ప్రెసిడెంట్ సురేంద్ర బాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకు వెళ్లానని సురేంద్రబాబు తెలియజేశారు..
హోమ్ మినిస్టర్ వెంటనే స్పందించి జర్నలిస్టులకు రక్షణ కల్పించి అన్ని రకాల అండగా ఉంటానని తెలియజేసినందుకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరపున డాక్టర్ సురేంద్రబాబు హోమ్ మినిస్టర్ అనితకు ధన్యవాదాలు తెలియజేశారు..