జనసైనికులకు భద్రత.భరోసా క్రియాశీలక సభ్యత్వం
కార్యకర్తలక్షేమం గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్
• కౌలు రైతుల ఆత్మహత్యలు చూసినస్పందించారు
• వైసీపీ నాయకుడు శ్రీ జగన్ తన జేబులోంచి పది రూపాయలైనా ప్రజలకు ఇచ్చారా?
• అబద్దాలు చెప్పడంలో జగన్ కి డాక్టరేట్
• కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులే అయింది… వైసీపీ కాట్ల కుక్కలా మీదపడుతోంది
• వైసీపీలో అవినీతి చేసిన ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరు
• జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీకె.నాగబాబు
• ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన ఆర్థిక భరోసా
• ఒకే రోజు 81 కుటుంబాలకు రూ. 4కోట్ల 5 లక్షలబీమా చెక్కులు పంపిణీ
• బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేసిన జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి నాగబాబు
‘ మన రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు
వంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి అయ్యారు, మానవతావాది అయిన పవన్ కళ్యాణ్ ఉప
ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటకముందే వైసీపీ నాయకులు పనికిమాలిన కామెంట్లు
చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం 6 నెలల సమయం ఇచ్చాం, వాళ్లు కనీసం
మూడు నెలల సమయం కూడా ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా మీద పడుతున్నారు. వాళ్లకు యాంటీ రాబీస్ ఇంజక్షన్
వేసి సైలెంటుగా కూర్చొబెడతాం. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. చేసిన
కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందే’ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అన్నారు.
దశాబ్ద కాలంగా సాగిన రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనీ,
ఎంతోమందితో మాటలు పడ్డా ప్రజాసేవ చేయాలనే ఒకే ఒక్క ఆకాంక్షతో ముందుకు కదిలారని చెప్పారు. ఆదివారం
మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యులకు సంబంధించిన బీమా చెక్కుల
పంపిణీ కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. సభ్యత్వం ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5
లక్షల బీమా చెల్లిస్తారు. ఇటీవలి కాలంలో వేర్వేరు ప్రమాదాల్లో 81 మంది జనసేన క్రియాశీలక సభ్యులు
మరణించారు, వారి కుటుంబాలకు నాగబాబు చేతుల మీదుగా రూ.5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ
చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబు ప్రసంగిస్తూ” ఎంతో మందికి శ్రీ పవన్ కళ్యాణ్ తనకు చేతనైన సాయం అందించారు. అందుకే ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన జేబు నుంచి పది రూపాయలు తీసి ఇవ్వడం నేను ఇంతవరకు చూడలేదు. అబద్ధాలు చెప్పడంలో జగన్ డాక్టరేట్ పొందారు, జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే… అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలు అని చెప్పారు. ఇప్పుడు కూడా వినుకొండలో పాత కక్షల వల్ల ఒకరు హత్యకు గురైతే దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశమవుతున్నాయి… రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా
దిగజారరు అనుకున్న ప్రతిసారి ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిదారిలో నడిస్తే ఓ పది, పదిహేనేళ్లకు మళ్లీ ప్రజలు ఆశీర్వదించొచ్చు
కార్యకర్తలకుటుంబాలకు అండగా…
• క్షేత్రస్థాయిలో జనసేన జెండా పట్టుకొని నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో జనసేన క్రియాశీలక సభ్యత్వం అనే బృహత్తర కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. బీమా సౌకర్యం వల్ల గత మూడేళ్లుగా 349 కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచాము, క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం 2021లో ప్రారంభమైంది. తొలి ఏడాది లక్షమంది క్రియాశీలక సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకుంటే… 2022లో 3.50 లక్షల మంది… 2023లో 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు 2021 నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో 349 మంది జనసైనికులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు రూ.17.45 కోట్ల ఆర్థిక సాయం అందించాం, గాయపడ్డ 443 మందికి రూ. 1.74 కోట్లు చెల్లించాం. మరణించిన వ్యక్తిని తిరిగి తీసుకురాకపోవచ్చు కానీ. క్రియాశీలక సభ్యత్వం వల్ల వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక భరోసా అందించి, అండగా నిలబడొచ్చు, కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఒక తాపీమేస్త్రీ పార్టీ భావజాలానికి ఆకర్షితుడై 2022లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు కూడా తెలియదు, ప్రమాదవశాత్తు ఆయన ఒక యాక్సిడెంట్ లో మరణించారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో మన పార్టీ నాయకులు ఆయన కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకొని పార్టీ తరఫున ప్రమాద బీమా చెక్ రూ.5 లక్షలు ఆ కుటుంబ సభ్యులకు అందించడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆడబిడ్డలు ఇబ్బందిపడకుండా ఈ బీమా సొమ్ము మమ్మల్ని కాపాడిందని ఆ తాపీమేస్త్రి భార్య కన్నీరు పెట్టుకుంది. ఇలా చాలా కుటుంబాలను ఈ బీమా సొమ్ము ఆదుకుంది.
• సాయం చేద్దాం… భద్రత కల్పిద్దాం
జనసైనికుల భద్రత, ఆర్థిక భరోసాకు క్రీయాశీలక సభ్యత్వం చాలా ఉపయోగపడుతుంది. ఇంటికి పెద్ద దిక్కు
కోల్పోయిన పరిస్థితుల్లో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి. జనసేనకు చెందిన ఏ కుటుంబానికి
ఇలాంటి పరిస్థితి రాకూడదనే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అందరూ పార్టీ సభ్యత్వం తీసుకోండి, పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితి సహకరించని వారికి
మనం అండగా నిలబడదాం, నాయకులు తలో చేయి వేసి సభ్యత్వం నమోదు చేసి వారి భవిష్యత్తుకు భద్రత
కల్పిద్దాం. నేను కూడా నాకు చేతనైనంత మందికి సభ్యత్వం తీసుకుంటాను మీరు కూడా తీసుకొని వారి
కుటుంబాలకు అండగా నిలబడండి, శ్రీ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.
దాదాపు 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున సాయం అందించారు. 2010లో నిర్మాతగా
నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నన్ను నా అన్నదమ్ములు ఇద్దరూ ఆదుకున్నారు, నాకు రాజకీయాల్లో
ఎలాంటి పదవి కాంక్ష లేదు, బతికున్నంత వరకు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తాను”
అన్నారు.
• ఆపత్కాలంలో అండగా నిలిచే కార్యక్రమం పి,హరిప్రసాద్
ఎమ్మెల్సీ, జనసేన పార్టీ అధ్యక్షుల వారి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి శ్రీ పి, హరిప్రసాద్ మాట్లాడుతూ… ఆపత్కాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే శ్రీ పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో ఉండగా పాయకరావుపేటలో ఇద్దరు జనసైనికులు విద్యుత్ షాక్ వల్ల మృతి చెందారు. ఆ సమయంలో వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన ఆ కుటుంబాల దయనీయ స్థితి చూసి చలించిపోయారు. వారికి ఆర్ధిక సాయం చేసినా, ఇలాంటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం తీసుకువచ్చారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా గత మూడేళ్లలో మృతి చెందిన జనసైనికుల కుటుంబాలకు, గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.19 కోట్ల మేర పరిహారం అందించాము” అన్నారు.